తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శబరిమల ఆలయ ప్రవేశ వ్యాజ్యం​ విచారణకు సుప్రీం ఓకే - శబరిమల ఆలయం

శబరిమల ఆలయంలోకి వెళ్లకుండా తనను అడ్డుకున్నారని ఓ మహిళ దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణకు సుప్రీం కోర్టు అంగీకరించింది. వచ్చే వారం వాదనలు ఆలకించనున్నట్లు వెల్లడించింది. ఎన్నికల బాండ్లపై స్టే విధించాలని దాఖలైన పిటిషన్​ విచారణకూ ఓకే చెప్పింది న్యాయస్థానం.

Sabarimala temple
శబరిమల ఆలయ ప్రవేశ వ్యాజ్యం​ విచారణకు సుప్రీం ఓకే

By

Published : Dec 4, 2019, 1:59 PM IST

శబరిమల ఆలయంలోకి వెళ్లాలనుకున్న తనను అడ్డుకున్నారని కేరళకు చెందిన ఓ మహిళ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అన్ని వయస్కుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పునకు వ్యతిరేకంగా తనను అడ్డుకున్నారని పిటిషనర్పేర్కొంది​. ఆమె వ్యాజ్యాన్ని పరిశీలించిన న్యాయస్థానం.. వచ్చే వారం వాదనలు వింటామని తెలిపింది.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట పిటిషన్​ను ప్రస్తావించారు మహిళ తరఫు సీనియర్​ న్యాయవాది కొలిన్​ గోన్సాల్వేస్​. సర్వోన్నత న్యాయస్థానం తీర్పునకు విరుద్ధంగా మహిళను అడ్డుకున్నారని... ఆమెకు ఆలయ ప్రవేశం కల్పిస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోరారు కొలిన్​.

ఇటీవల మహిళా కార్యకర్తలు బిందు అమ్మిని, ఫాతిమాలు.. శబరిమల ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా భక్తులు వారిని అడ్డుకున్నారు.

ఎన్నికల బాండ్ల నిలిపివేతపైనా..

ఎన్నికల బాండ్ల పథకంపై స్టే విధించాలని దాఖలైన పిటిషన్​ విచారణకూ సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. వచ్చే నెలలో విచారణ చేపడతామని సీజేఐ జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. లంచం, మనీలాండరింగ్​, నల్లధనం వ్యాప్తి వంటి వాటికి ఈ పథకం ఉపయోగపడుతుందని ఆరోపించారు పిటిషనర్​​ తరఫు న్యాయవాది ప్రశాంత్​ భూషణ్​. అధికారంలో ఉన్న పార్టీ ఈ పథకాన్ని దుర్వినియోగపరిచే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: అప్పు కోసం బ్యాంక్​లో తుపాకీతో వీరంగం

ABOUT THE AUTHOR

...view details