తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడు సుప్రీంలో విచారణకు 'కశ్మీర్' అంశం​

కశ్మీర్​పై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలైన వ్యాజ్యాలను నేడు పరిశీలించనుంది అత్యున్నత న్యాయస్థానం.

By

Published : Aug 28, 2019, 5:01 AM IST

Updated : Sep 28, 2019, 1:29 PM IST

కశ్మీర్

నేడు సుప్రీంలో విచారణకు 'కశ్మీర్' అంశం​

జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ​ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. వీటితో పాటు రాష్ట్రంలో సమాచార వ్యవస్థను స్తంభింపజేయటం, మీడియాపై ఆంక్షలు ఎత్తివేయాలన్న అభ్యర్థనలనూ పరిశీలించనుంది.

ఆర్టికల్​ 370 రద్దును వ్యతిరేకిస్తూ న్యాయవాది ఎంఎల్ శర్మ, నేషనల్ కాన్ఫరెన్స్​ ఎంపీ మహ్మద్​ అక్బర్​ లోన్​, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ హస్నైన్​ మసూది.. సుప్రీంలో వ్యాజ్యాలను దాఖలు చేశారు. వీరికి తోడుగా మాజీ ఐఏఎస్ అధికారి షా ఫైసల్​, జవహార్​లాల్​ నెహ్రూ విశ్వవిద్యాలయం మాజీ విద్యార్థి నాయకుడు షెహ్లా రషీద్​ తదితరులు పిటిషన్లు వేశారు.

కశ్మీర్​లోని సీపీఎం నేత మహ్మద్​ తారిగామిని కోర్టు ముందు ప్రవేశపెట్టాలంటూ ఆ పార్టీ నేత సీతారాం ఏచూరి హెబియస్​ కార్పస్ రిట్​ దాఖలు చేశారు. మొత్తానికి కశ్మీర్​ అంశానికి సంబంధించి అన్ని అభ్యర్థనలు, వ్యాజ్యాలను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్​ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారించనుంది.

ఇదీ చూడండి: జమ్ముకశ్మీర్​ 'పంపకాల'పై హోంశాఖ కసరత్తు

Last Updated : Sep 28, 2019, 1:29 PM IST

ABOUT THE AUTHOR

...view details