తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రేపు సుప్రీం ముందుకు అయోధ్య కేసు

వివాదాస్పద అయోధ్య రామజన్మభూమి - బాబ్రీ మసీదు కేసులో రేపు సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది. సమస్య పరిష్కారానికి మధ్యవర్తుల ఏర్పాటు అనంతరం మొదటిసారిగా విచారణకు వచ్చింది కేసు.

By

Published : May 9, 2019, 7:56 PM IST

అయోధ్య

అయోధ్య కేసుపై సుప్రీంకోర్టు రేపు విచారణ చేపట్టనుంది. వివాదం పరిష్కారానికి మధ్యవర్తుల ప్యానెల్​ ఏర్పాటు తర్వాత మొదటిసారిగా కేసును విచారించనుంది న్యాయస్థానం. భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ కేసును పరిశీలిస్తుందని సుప్రీం కోర్టు ఓ నోటీసులో తెలిపింది.

అయోధ్య రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం పరిష్కారం కోసం మార్చి 8న మధ్యవర్తుల ప్యానెల్​ను ఏర్పాటు చేసింది అత్యున్నత న్యాయస్థానం. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఎఫ్ఎం ఖలీఫుల్లా నేతృత్వంలో ఆధ్మాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరాం పంచూలను ప్యానెల్​ సభ్యులుగా నియమించింది.

విచారణకు సంబంధించిన మధ్యంతర నివేదికను ప్యానెల్​ సభ్యులు సీల్డ్​ కవర్​లో ఇప్పటికే సుప్రీం కోర్టుకు సమర్పించినట్లు సమాచారం.

ఇదీ చూడండి: 'వారి అర్హత, ప్రవర్తనలో ఎలాంటి లోపం లేదు'

ABOUT THE AUTHOR

...view details