తెలంగాణ

telangana

By

Published : Jul 8, 2019, 3:55 PM IST

ETV Bharat / bharat

సుప్రీంకోర్టు రిజిస్ట్రీపై పోలీసుల పర్యవేక్షణ!

సుప్రీంకోర్టు కార్యాలయంలో జరుగుతున్న ఆక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్​ గొగొయి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రిజిస్ట్రీపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో పర్యవేక్షణ కోసం సీబీఐ, దిల్లీ పోలీసు విభాగానికి చెందిన సీనియర్ ఎస్పీలను నియమించేందుకు నిర్ణయించారు.

సుప్రీం

సుప్రీంకోర్టు కార్యాలయంలో అక్రమాలపై నిఘా పెట్టేందుకు పోలీసు అధికారులను రంగంలోకి దించాలని నిర్ణయించారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి. ఇందుకోసం సీబీఐ, దిల్లీ పోలీసు విభాగాల నుంచి సీనియర్​ ఎస్పీలను డిప్యుటేషన్​పై తీసుకురావాలని సీజేఐ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

వేర్వేరు ధర్మాసనాలు విచారించాల్సిన కేసుల జాబితా రూపకల్పనలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో సీజేఐ ఈ నిర్ణయం తీసుకున్నారు. అనుమానం ఉన్న కేసులు సహా ఉద్యోగులు, న్యాయవాదుల కార్యకలాపాలనూ వీరు పర్యవేక్షిస్తారు.

వరుస ఆరోపణలు

ఇటీవల ఓ పారిశ్రామికవేత్తకు సంబంధించిన కేసులో తీర్పును మార్చినట్లు వచ్చిన ఆరోపణలతో ఇద్దరు కోర్టు సిబ్బందిపై సీజేఐ వేటు వేశారు.

కేసులను ధర్మాసనాల ముందుకు తీసుకురావడంలో మధ్యవర్తుల జోక్యం ఉంటోందని న్యాయవాది ఉత్సవ్​ బైన్స్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఆరోపణలపై విచారణకు ఇప్పటికే జస్టిస్​ ఏకే పట్నాయక్ నేతృత్వంలో ఏక సభ్య కమిటీని నియమించింది అత్యున్నత న్యాయస్థానం.

ఇదీ చూడండి: 'ఆపరేషన్ సుదర్శన్​'తో సరిహద్దులు భద్రం

ABOUT THE AUTHOR

...view details