తెలంగాణ

telangana

జయ మృతిపై కమిషన్ విచారణ నిలుపుదల

By

Published : Apr 26, 2019, 1:27 PM IST

Updated : Apr 26, 2019, 2:04 PM IST

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్​ తదుపరి కార్యకలాపాలపై స్టే విధించింది సుప్రీంకోర్టు. అపోలో ఆసుపత్రి అభ్యర్థనపై ఈ నిర్ణయం తీసుకుంది.

జయలలిత మృతిపై కమిషన్ విచారణ నిలుపుదల

జయలలిత మృతిపై కమిషన్ విచారణ నిలుపుదల

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణకు ఏర్పాటైన కమిషన్​ తదుపరి కార్యకలాపాలపై స్టే విధించింది సుప్రీం కోర్టు. మద్రాస్​ హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ అపోలో ఆసుపత్రి దాఖలు చేసిన పిటిషన్​పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం ఈమేరకు నిర్ణయం తీసుకుంది.

2017 సెప్టెంబర్​లో కమిషన్​ ఏర్పాటు..

2016 డిసెంబర్​ 5న చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో జయలలిత కన్నుమూశారు. ఆమె మృతిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో జరిగిన చికిత్స విధానం, సంబంధిత పరిణామాలపై విచారణకు 2017 సెప్టెంబర్​లో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్​ ఆర్ముఘస్వామి నేతృత్వంలో కమిషన్​ వేసింది తమిళనాడు ప్రభుత్వం.

కమిషన్​పై కోర్టుకు ఆసుపత్రి వర్గాలు...

జయ మృతిపై కమిషన్​ ఏర్పాటును వ్యతిరేకించింది అపోలో ఆసుపత్రుల యాజమాన్యం. ప్రభుత్వ ఆదేశాలను రద్దు చేయాలని మద్రాస్​ హైకోర్టును ఆశ్రయించింది. ఏప్రిల్​ 4న ఆసుపత్రి పిటిషన్​ను తిరస్కరించింది హైకోర్టు. విచారణకు సహకరించాలని ఆదేశించింది.

మద్రాస్​ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేసింది అపోలో ఆసుపత్రుల యాజమాన్యం.

ఇదీ చూడండి:'మోదీ బయోపిక్​ విడుదలపై జోక్యం చేసుకోలేం'

Last Updated : Apr 26, 2019, 2:04 PM IST

ABOUT THE AUTHOR

...view details