తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా పరీక్షల ధరలపై కేంద్రానికి నోటీసులు - rtpcr pil

కరోనా నిర్ధరణ కోసం చేసే ఆర్​టీ-పీసీఆర్​ పరీక్షలకు దేశవ్యాప్తంగా ఒకే ధర నిర్ణయించాలని దాఖలైన పిటిషన్​ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఇందుకు సంబంధించి కేంద్రంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది ధర్మాసనం.

SC seeks Centre's response on PIL seeking to fix maximum rate for RT-PCR test
ఆర్​టీపీసీఆర్ పరీక్షలపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు

By

Published : Nov 24, 2020, 2:33 PM IST

కొవిడ్​ నిర్ధరణ పరీక్షలపై సుప్రీంకోర్టు... కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఆర్టీ-పీసీఆర్ టెస్టుకు గరిష్ఠంగా రూ.400 మాత్రమే వసూలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్​పై వివరణ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశింది. ఇందుకుగాను రెండు వారాల గడువు ఇస్తున్నట్లు పేర్కొంది.

ఆర్​టీ-పీసీఆర్ పరీక్షకు రూ.200 ఖర్చు అవుతుంటే ఆస్పత్రులు, ల్యాబ్స్ ఎక్కువ ధరలు వసూలు చేస్తున్నాయని న్యాయవాది అజయ్ అగర్వాల్ పిటిషన్​లో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఒకే ధరను అమలు చేసేలా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలని అందులో కోరారు. దీనిపై విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్​ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

ఇదీ చూడండి: సీఎంఓ మాజీ ముఖ్యకార్యదర్శి అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details