తెలంగాణ

telangana

ETV Bharat / bharat

షాహీన్​బాగ్​ నిరసనకారులను తప్పుబట్టిన సుప్రీం - దిల్లీ షాహిన్​బాగ్​లో రహదారులు దిగ్బంధించడం

దిల్లీ షాహీన్​బాగ్​ ఆందోళనలకు సంబంధించిన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. నిరసనల పేరిట రహదారులు దిగ్బంధించి, ఇతరులకు ఇబ్బంది కలిగించడం తగదని అభిప్రాయపడింది. ఈ వ్యవహారంపై వివరణ కోరుతూ కేంద్రం, దిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.

sc
షాహీన్​బాగ్​ నిరసనకారులను తప్పుబట్టిన సుప్రీం

By

Published : Feb 10, 2020, 2:05 PM IST

Updated : Feb 29, 2020, 8:55 PM IST

షాహీన్​బాగ్​ నిరసనకారులను తప్పుబట్టిన సుప్రీం

పౌరసత్వ చట్ట సవరణపై నిరసన పేరిట దిల్లీ షాహిన్​బాగ్​లో రహదారులు దిగ్బంధించడం, ఇతరులకు ఇబ్బంది కలిగించడం తగదని అభిప్రాయపడింది సుప్రీంకోర్టు. ప్రజలకు నిరసన తెలిపే హక్కు ఉన్నా... అది నిర్దేశిత ప్రాంతంలోనే చేయాలని హితవు పలికింది.

"ఒక చట్టం తెచ్చారు. దానితో తమకు ఇబ్బందులు ఉన్నాయని ప్రజలు అంటున్నారు. ప్రస్తుతం ఆ వివాదం కోర్టు పరిధిలో ఉంది. అయినా కొందరు నిరసన చేపడుతున్నారు. వారికి ఆ హక్కు ఉంది. కానీ మీరు రహదారులు దిగ్బంధించకూడదు. ఒకే ప్రాంతంలో నిరవధికంగా నిరసన కార్యక్రమం నిర్వహించకూడదు. మీరు నిరసన తెలపాలనుకుంటే... అందుకు నిర్దేశించిన ప్రాంతంలోనే ఆ పని చేయాలి."

-సుప్రీంకోర్టు

ఆందోళనకారులను అక్కడి నుంచి తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్​పై విచారణ జరిపింది సుప్రీంకోర్టు. దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్రం, దిల్లీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.

ఆదేశాలు ఇచ్చేందుకు నిరాకరణ

షాహీన్​బాగ్​ నిరసనల విషయంలో స్పష్టమైన కార్యాచరణ చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు న్యాయవాది శశాంక్​ దేవ్ సుధి. ఇందుకు న్యాయస్థానం నిరాకరించింది. అవతలి పక్షం వాదనలు వినకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టంచేసింది. విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది.

ఇదీ చూడండి : దిల్లీ ఓటింగ్​ శాతం ప్రకటనలో ఎందుకింత జాప్యం?

Last Updated : Feb 29, 2020, 8:55 PM IST

ABOUT THE AUTHOR

...view details