బిహార్ అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్ను తోసిపుచ్చింది సుప్రీంకోర్టు. కరోనా నేపథ్యంలో ఎన్నికలు సజావుగా జరిగే అవకాశం లేదని దాఖలైన వాజ్యాన్ని విచారణకు నిరాకరించింది. అజయ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్పై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
బిహార్ ఎన్నికల వాయిదాపై పిటిషన్ తిరస్కరణ - బిహార్ అసెంబ్లీ ఎన్నికలు
కరోనా నేపథ్యంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
![బిహార్ ఎన్నికల వాయిదాపై పిటిషన్ తిరస్కరణ SC refuses to entertain plea for deferment of Bihar Assembly polls](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8930357-365-8930357-1601016701383.jpg)
బిహార్ ఎన్నికలు వాయిదా వేయాలనే పిటిషన్ తిరస్కరణ
'ప్రతి ఒక్కరిని ఎన్నికల సంఘం వద్దకు వెళ్లేందుకు అనుమతించబోము, పిటిషన్ను ఉపసంహరించుకునేందుకే అనుమతిస్తాం' అని విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన ధర్మాసనం. అనంతరం వ్యాజ్యాన్ని ఉపసంహరించుకున్నారు అజయ్.