తెలంగాణ

telangana

By

Published : Mar 4, 2020, 4:21 PM IST

ETV Bharat / bharat

అల్లర్ల వ్యాజ్యాలను విచారించండి: దిల్లీ హైకోర్టుకు సుప్రీం

సీఏఏకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో జరిగిన హింసపై బాధితులు దాఖలు చేసిన పిటిషన్​ను విచారించాలని దిల్లీ హైకోర్టుకు సూచించింది సుప్రీంకోర్టు. అయితే కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్​పై కార్యకర్త హర్ష్​ మందర్ చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలకు సంబంధించిన వ్యాజ్యాలను సుప్రీంకోర్టే విచారించనుంది.

SC refers to HC plea seeking lodging of FIRs against politicians for hate speech
దిల్లీ అల్లర్ల వ్యాజ్యాలను విచారించండి: దిల్లీ హైకోర్టుకు సుప్రీం

దేశ రాజధానిలో చెలరేగిన హింసాత్మక 'పౌర' అల్లర్ల బాధితులు దాఖలు చేసిన పిటిషన్లను ఈనెల 6న విచారించాలని దిల్లీ హైకోర్టును ఆదేశించింది సుప్రీంకోర్టు. ప్రజలను రెచ్చగొట్టేలా విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన రాజకీయ నేతలపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేయాలని అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు 10 మంది పిటిషనర్లు. వీరి వ్యాజ్యాలపై వాదనలు విన్న ధర్మాసనం.. సదరు వ్యాజ్యాలతో పాటు దిల్లీ అల్లర్లకు సంబంధించిన ఇతర పిటిషన్లను కూడా వీలైనంత వేగంగా విచారణ చేయాలని దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరింది.

అయితే కార్యకర్త 'హర్ష్​ మందర్'​ విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని ఆరోపణలు చేస్తూ దాఖలైన పిటిషన్లను మాత్రం తామే విచారిస్తామని తెలిపింది సర్వోన్నత న్యాయస్థానం.

మందర్​పై వచ్చిన ఆరోపణలపై కేంద్రం తరఫున అఫిడవిట్​ దాఖలు చేయాలని సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతాకు సూచించింది. స్పందించిన మెహతా మధ్యాహ్న భోజన సమావేశ సమయంలో ఉన్నత న్యాయస్థానం రిజిస్ట్రీతో అఫిడవిట్​ దాఖలు చేస్తామని, కాపీని మాండర్​ తరఫు న్యాయవాదికి అందిస్తామని చెప్పారు. మాండర్​ తరఫు న్యాయవాది కేంద్రం ఆరోపించినట్లు.. మాండర్​ ఎటువంటి విద్వేషపూరిత ప్రసంగం చేయలేదని వెల్లడించారు.

ఇదీ చదవండి:భారత్​లో 28 మందికి కరోనా: కేంద్ర మంత్రి

ABOUT THE AUTHOR

...view details