తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాత్రికేయుడు కనోజియాకు సుప్రీం బెయిల్​ - supreme court

ఉత్తరప్రదేశ్​లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అరెస్టయిన పాత్రికేయుడు ప్రశాంత్​ కనోజియాను తక్షణం విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. యూపీ సీఎం ఆదిత్యనాథ్​పై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతకర వీడియో పెట్టారనే ఆరోపణలపై కనోజియా అరెస్టయ్యారు.

జర్నలిస్ట్​కు బెయిల్

By

Published : Jun 11, 2019, 1:01 PM IST

ఉత్తరప్రదేశ్​లో అరెస్టయిన పాత్రికేయుడు ప్రశాంత్​ కనోజియాకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. కనోజియాను తక్షణమే విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. సామాజిక మాధ్యమాల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్​పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసారనే ఆరోపణల నేపథ్యంలో ప్రశాంత్​ను అదుపులోకి తీసుకున్నారు యూపీ పోలీసులు.

పోలీసుల చర్యను వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు కనోజియా భార్య జగీశా అరోడా. అరెస్టు అక్రమమని, రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. అభ్యర్థనను స్వీకరించిన జస్టిస్​ ఇందిరా బెనర్జీ, జస్టిస్​ అజయ్​ రస్తోగీ నేతృత్వంలోని ధర్మాసనం బెయిల్​ మంజూరు చేసింది.

"ఇది స్వేచ్ఛా హక్కు. ప్రాథమిక హక్కు. ఇది చర్చించాల్సిన విషయం కాదు. బెయిల్​ ఇస్తున్నాం. అంత మాత్రాన అతని ట్వీట్లు, సామాజిక మాధ్యమాల్లోని పోస్టులను సమర్థించినట్టు కాదు."

- సుప్రీం ద్విసభ్య ధర్మాసనం

ఆదిత్యనాథ్​ను విమర్శిస్తూ సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరమైన వీడియోను పోస్టు చేశారనేది కనోజియాపై ఆరోపణ. దీనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు యూపీ పోలీసులు. దిల్లీలో ఉన్న ప్రశాంత్​ను అరెస్ట్​ చేసి లఖ్​నవూకు తరలించారు. ఈ వార్తలు ప్రసారం చేసిన ఓ టీవీ ఛానల్​ ఎడిటర్​నూ అదుపులోకి తీసుకున్నారు.

యోగిది అవివేక చర్య : రాహుల్

జర్నలిస్ట్​ ప్రశాంత్​, టీవీ ఛానల్​ ఎడిటర్​​ అరెస్టుపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు సంధించారు. యోగి నిర్ణయం అవివేకమని మండిపడ్డారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: బెంగాల్​లో బాంబుల మోత.. భయంలో స్థానికులు

ABOUT THE AUTHOR

...view details