తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఫేస్​బుక్​ ఖాతాకు ఆధార్​ లింక్​పై నిర్ణయం సుప్రీందే! - FACEBOOK PETITION IN SUPREME COURT

'సోషల్​ మీడియా ప్రొఫైళ్లకు ఆధార్​ అనుసంధానం' కేసుల విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ హైకోర్టుల్లో విచారణల్లో ఉన్న సంబంధిత కేసులను తనకు బదిలీ చేసుకుంది. ఫేస్​బుక్​ వేసిన వ్యాజ్యం మేరకు అత్యున్నత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. 2020 జనవరి చివరి వారంలో వీటిని పరిశీలించనున్నట్లు స్పష్టం చేసింది.

ఫేస్​బుక్​ ఖాతాకు ఆధార్​ లింక్​పై నిర్ణయం సుప్రీందే!

By

Published : Oct 22, 2019, 1:21 PM IST

Updated : Oct 22, 2019, 7:14 PM IST

ఫేస్​బుక్​ ఖాతాకు ఆధార్​ లింక్​పై నిర్ణయం సుప్రీందే!

'సోషల్​ మీడియా యూజర్​ ప్రొఫైళ్లకు ఆధార్​ అనుసంధానం'పై అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఫేస్​బుక్​ దాఖలు చేసిన పిటిషన్​ మేరకు... వివిధ హైకోర్టుల్లో పెండింగ్​లో ఉన్న సంబంధిత కేసులను తనకు బదిలీ చేసుకుంది. 2020 జనవరి చివరివారంలో ఈ కేసుల జాబితాను ధర్మాసనం ముందుకు తీసుకురావాలని రిజిస్ట్రీకి సూచించింది.

సోషల్ మీడియా దుర్వినియోగాన్ని నియంత్రించడానికి అవసరమైన నిబంధనలపై జనవరిలో నివేదిక సమర్పించాలని కేంద్రానికి సూచించింది సుప్రీంకోర్టు.

అనుసంధానం తప్పనిసరి!

సామాజిక మాధ్యమ యూజర్​ ప్రొఫైళ్లకు ఆధార్​ అనుసంధానం తప్పనిసరి చేయాలంటూ మద్రాసు, బొంబాయి, మధ్యప్రదేశ్ హైకోర్టుల్లో గతంలో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. మద్రాసు హైకోర్టులో విస్తృత విచారణ జరిగింది. సామాజిక మాధ్యమాల్లో అసత్య, అశ్లీల, దేశవ్యతిరేక, ఉగ్రవాద భావజాలం వ్యాప్తిని అడ్డుకునేందుకు... యూజర్​ ప్రొఫైళ్లకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి అని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకు నివేదించింది.

అయితే... ఇలా చేస్తే వినియోగదారుల గోప్యతకు భంగం కలుగుతుందని ఫేస్​బుక్​ వాదించింది. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఫేస్​బుక్​ అభ్యర్థన మేరకు సంబంధిత కేసులన్నింటినీ తనకు బదిలీ చేసుకుంది సర్వోన్నత న్యాయస్థానం.

Last Updated : Oct 22, 2019, 7:14 PM IST

ABOUT THE AUTHOR

...view details