తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రిజర్వేషన్ల వ్యతిరేక మనస్తత్వాన్ని విడనాడాలి'

రాష్ట్రీయ స్వయంసేవక్​ సంఘ్​ (ఆర్​ఎస్​ఎస్​)పై తీవ్ర విమర్శలు చేశారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. రిజర్వేషన్ల వ్యతిరేక మనస్తత్వాన్ని విడనాడాలని హితవు పలికారు. రిజర్వేషన్లు రాజ్యాంగం కల్పించిన హక్కని స్పష్టం చేశారు.

By

Published : Aug 19, 2019, 5:59 PM IST

Updated : Sep 27, 2019, 1:22 PM IST

'రిజర్వేషన్ల వ్యతిరేక మనస్తత్వాన్ని విడనాడాలి'

రిజర్వేషన్ల వ్యతిరేక మనస్తత్వాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్​ సంఘ్​ (ఆర్​ఎస్​ఎస్​) విడనాడాలని హితవు పలికారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. రిజర్వేషన్లు రాజ్యాంగం కల్పించిన హక్కుగా తెలిపారు. వాటికి భంగం కలిగించటం అన్యాయం అని పేర్కొన్నారు.

రిజర్వేషన్లకు అనుకూలంగా ఉన్న వారికి, దానిని వ్యతిరేకించే వారికి మధ్య సామరస్యపూర్వక వాతావరణంలో చర్చ జరగాలని ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ మోహన్​ భగవత్​ పేర్కొన్నారు. ఆ మరుసటి రోజునే భగవత్​ వ్యాఖ్యలను తప్పుపట్టారు మాయావతి. అలాంటి చర్చ ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తుందన్నారు.

" ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వర్తించే రిజర్వేషన్లపై సామరస్యపూర్వకంగా చర్చ జరగాలని ఆర్​ఎస్​ఎస్​ పేర్కొంది. దాని ద్వారా విపత్కర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. అలాంటివి అవసరం లేదు. రిజర్వేషన్లు అనేది మానవత్వానికి సంబంధించినవి. రాజ్యాంగం కల్పించిన హక్కు. వాటికి భంగం కలిగించటం అన్యాయం, అక్రమం. ఆర్​ఎస్​ఎస్​ రిజర్వేషన్ల వ్యతిరేక మనస్తత్వాన్ని విడనాడితే మంచిది."

- మాయావతి, బీఎస్పీ అధినేత్రి.

ఆదివారం దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మోహన్​ భగవత్​ రిజర్వేషన్లపై మాట్లాడారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున గందరగోళం ఏర్పడి చర్చ ప్రధాన అంశం నుంచి పక్కదోవపట్టింది.

ఇదీ చూడండి: స్విగ్గీలో బీర్​.. అడ్డంగా దొరికిపోయిన చోర్​!

Last Updated : Sep 27, 2019, 1:22 PM IST

ABOUT THE AUTHOR

...view details