తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సైకత శిల్పంతో 'సర్వేపల్లి'కి ఘన నివాళి - Sand Art

ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఝార్ఖండ్​లోని ఓ కళాకారుడు తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇసుకతో డాక్టర్​ సర్వేపల్లి రాధాక్రిష్ణన్​ చిత్రాన్ని తీర్చిదిద్ది అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు.

టీచర్స్ డే స్పెషల్​ : ఇసుకతో అద్భుతమైన సర్వేపల్లి చిత్రం!

By

Published : Sep 5, 2019, 5:03 PM IST

Updated : Sep 29, 2019, 1:27 PM IST

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని 'డాక్టర్​ సర్వేపల్లి రాధాక్రిష్ణన్​'ను దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ స్మరించుకుంటున్నారు. దేశ తొలి ఉపరాష్ట్రపతికి తమదైన శైలిలో నివాళులు అర్పిస్తున్నారు. ఝార్ఖండ్​ బొకారో జిల్లా చందన్​కియారీ గ్రామానికి చెందిన 'సందక్​ అజయ్​ శంకర్​ మెహతో'.. టీచర్స్ ​డేను సరికొత్తగా జరుపుకున్నాడు. ఇసుకతో భారతరత్న సర్వేపల్లి చిత్రాన్ని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్ది అందరి మెప్పు పొందాడు.

టీచర్స్ డే స్పెషల్​ : ఇసుకతో అద్భుతమైన సర్వేపల్లి చిత్రం!

తెరిచిన పుస్తకం రూపంలో ఉన్న ఈ సైకత శిల్పంలో ఒక పేజీలో సర్వేపల్లి చిత్రం, మరో పేజీలో " ద బెస్ట్​ టీచర్స్​ ఫ్రమ్​ హార్ట్​ నాట్​ ఫ్రమ్​ ద బుక్​ (గొప్ప ఉపాధ్యాయులు హృదయం నుంచి వస్తారు. పుస్తకాల నుంచి కాదు) " అనే సందేశాన్ని రాశారు. కింది భాగంలో 'హ్యాపీ టీచర్స్​ డే' అని శుభాకాంక్షలు తెలిపి చివరన పెన్ను ఆకారమున్న చిత్రాన్ని గీశారు. మరోవైపు భారతరత్న అవార్డునూ తీర్చిదిద్దారు. దామోదర్​ నదీ తీరంలోని షిల్​ఫోర్​ గ్రామంలో ఉన్న ఈ చిత్రాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి చేరుకుంటున్నారు.

Last Updated : Sep 29, 2019, 1:27 PM IST

ABOUT THE AUTHOR

...view details