తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో నేతలపై గృహనిర్బంధం ఎత్తివేత - జమ్ముకశ్మీర్​లో నేతలపై గృహనిర్బంధం ఎత్తవేత

జమ్ము కశ్మీర్​లో పలువురు నేతలపై గృహ నిర్బంధం ఎత్తివేసినట్లు ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు. స్థానిక ఎన్నికల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

జమ్ముకశ్మీర్​

By

Published : Oct 3, 2019, 4:59 AM IST

Updated : Oct 3, 2019, 7:24 AM IST

జమ్ముకశ్మీర్​లో నేతలపై గృహనిర్బంధం ఎత్తివేత

ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్‌లో స్థానిక నాయకులపై విధించిన ఆంక్షలను సడలించింది ప్రభుత్వం. స్థానిక సంస్థలైన బ్లాక్‌ అభివృద్ధి మండలి (బీడీసీ) ఎన్నికల దృష్ట్యా వారిని విడుదల చేసే నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు.

ఇప్పటివరకూ విడుదలైన వారిలో దేవేంద్రసింగ్‌ రానా(ఎన్సీ), హర్ష్‌దేవ్‌ సింగ్‌ (ఎన్‌పీపీ), రామన్‌ భల్లా(కాంగ్రెస్‌) తదితరులు ఉన్నారు.

మాజీ ముఖ్యమంత్రులైన మెహబూబా ముఫ్తీ, ఓమర్‌ అబ్దుల్లా, ఫరూక్‌ అబ్దుల్లా సహా ఇతర అగ్రనేతలు ఆగస్టు 5 నుంచి గృహ నిర్బంధంలో ఉన్నారు.

24న ఎన్నికలు..

జమ్ము కశ్మీర్‌లో 310 బీడీసీలకు అక్టోబరు 24న ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీలో సభ్యులుగా ఉన్నవారు ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుంటారు. వీరు బ్లాక్‌ అభివృద్ధి మండలి (బీడీసీ) పాలకవర్గాన్ని ఎన్నుకుంటారు.

ఇదీ చూడండి: భారత్​ ఫస్ట్: ఎస్​-400 కొనుగోలుపై జయ్​శంకర్

Last Updated : Oct 3, 2019, 7:24 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details