తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పీఎంఏవై' కింద కోటి ఇళ్ల మంజూరు.. ప్రధాని హర్షం - Urban Affairs Minister Hardeep Singh Puri

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రధాన మంత్రి ఆవాస్​ యోజన​ పథకం కింద ఇప్పటి వరకు కోటి గృహాలను మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి హర్​దీప్ సింగ్ పురి తెలిపారు. ఇది మధ్య తరగతి, పేద ప్రజల విజయమని ప్రధాని మోదీ కొనియాడారు.

Sanction of over 1 crore houses under PMAY(U) momentous achievement
పీఎంఏవై పథకం ద్వార కోటి ఇళ్ల మంజూరు.. ప్రధాని హర్షం

By

Published : Dec 27, 2019, 11:33 PM IST

దేశంలోని ప్రతి నిరుపేద, మధ్య తరగతి కుటుంబానికి ఇల్లు ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకం ప్రధానమంత్రి ఆవాస్​ యోజన- అర్బన్ (పీఎంఏవై-యూ). ఈ పథకం కింద ఇప్పటి వరకు కోటి ఇళ్లను మంజూరు చేసినట్లు ట్విట్టర్​లో తెలిపారు కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రి హర్​దీప్​ సింగ్​ పురి. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఇది 'పట్టణంలో నివసించే పేదలు, మధ్య తరగతి ప్రజల విజయం' అని ట్వీట్ చేశారు.

"ఈ రోజు 50వ సీఎస్​ఎంసీ సమావేశం అనంతరం పీఎంఏవై-యూ పథకం కింద కోటి ఇళ్లు మంజూరు చేశామని ప్రకటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. 2022 నాటికి అందరికి ఇల్లు ఉండాలనేదే ఈ పథకం ప్రధాన లక్ష్యం."
-హర్​దీప్​ సింగ్​ పురి ట్వీట్​.

కేంద్ర మంత్రి చేసిన ట్వీట్​కు స్పందించారు ప్రధాని మోదీ.

"సాంకేతిక పరిజ్ఞాణాన్ని ఉపయోగించి ఎంతో పారదర్శకతతో ఈ పథకాన్ని అమలు చేసి విజయం సాధించాం. భారత్​లో నివసించే ప్రజలందరికీ ఇల్లు ఉండాలని భావించి ఎంతో కృషి చేసిన పట్టణ మంత్రిత్వ శాఖకు నా అభినందనలు."
-నరేంద్రమోదీ, ప్రధాని ట్వీట్​.

ఇదీ చూడండి:మిషన్ మార్స్​: శక్తిమంతమైన రాకెట్​ను ప్రయోగించిన చైనా

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details