రాజ్యసభ ఎంపీ, సమాజ్వాదీ పార్టీ మాజీ నేత అమర్ సింగ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 64 ఏళ్లు. ఈ ఏడాది మార్చి నుంచి అమర్ సింగ్ అనారోగ్యంతో సింగపూర్లోని మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. 2013లో ఆయన మూత్ర పిండాల మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఉత్తర్ప్రదేశ్లోని అజాంగఢ్లో జన్మించిన అమర్ సింగ్ గతంలో సమాజ్వాదీ పార్టీలో కీలక నేతగా వ్యవహరించారు.
2008లో యూపీఏ ప్రభుత్వానికి కమ్యూనిస్టు పార్టీ మద్దతు ఉపసంహరించిన సమయంలో సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్కు అండగా నిలిచింది. ఆ సమయంలో అమర్ సింగ్ సమాజ్వాదీ పార్టీలో కీలక పాత్ర పోషించారు. అమర్ సింగ్కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.