తెలంగాణ

telangana

వివాదస్పద వ్యాఖ్యలపై సాధ్వి క్షమాపణలు...

ఉగ్రవాద వ్యతిరేక బృందం విభాగాధిపతి హేమంత్​ కర్కరేపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు సాధ్వి ప్రజ్ఞ సింగ్ ఠాకుర్​. తన ప్రకటన వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

By

Published : Apr 19, 2019, 10:12 PM IST

Published : Apr 19, 2019, 10:12 PM IST

వివాదస్పద వ్యాఖ్యలపై సాధ్వి క్షమాపణలు

ముంబయి ఉగ్రదాడిలో అమరుడైన హేమంత్​ కర్కరేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పారు భోపాల్ లోక్​సభ భాజపా అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞ సింగ్​ ఠాకుర్. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. శత్రువులకు అవకాశం ఇవ్వొద్దనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వివరణ ఇచ్చారు.

వివాదస్పద వ్యాఖ్యలపై సాధ్వి క్షమాపణలు

"శత్రువులకు మనోబలాన్ని ఇవ్వకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నా. ఇది దేశ అంతర్గత విషయం. నా వ్యక్తిగత వ్యధ.. అందుకే నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా. క్షమాపణలు చెబుతున్నా. శత్రుదేశం నుంచి వచ్చిన ఉగ్రవాదుల తూటాలకు మన అధికారి ప్రాణాలు విడిచారు. ఆయన కచ్చితంగా అమరుడే."
-సాధ్వి ప్రజ్ఞ సింగ్ ఠాకూర్​

మోదీ క్షమాపణకు కాంగ్రెస్​ డిమాండ్​..

సాధ్వీ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డాయి విపక్షాలు. ఈ అంశంలో ప్రధాని మోదీ భారత ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేసింది కాంగ్రెస్​.

''భారతదేశాన్ని రక్షించే ప్రయత్నంలో హేమంత్​ కర్కరే ప్రాణాలర్పించారు. ఆయన తగిన గౌరవానికి అర్హులు.''
- రాహుల్​ గాంధీ ట్వీట్​

''నరేంద్ర మోదీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే. నేడు దేశ ప్రజల ముందు భాజపా అసలు రంగు బయటపడింది. వారు దేశ వ్యతిరేకులు. అమరవీరుల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తూ.. వారు అన్ని హద్దులు అతిక్రమించారు. ప్రజ్ఞపై ప్రధానమంత్రి కఠిన చర్యలు తీసుకోవాల్సిందే.''
- రణ్​దీప్​ సుర్జేవాలా, కాంగ్రెస్​ పార్టీ అధికార ప్రతినిధి

పార్టీతో సంబంధం లేదని భాజపా లేఖ

సాధ్వి ప్రజ్ఞ సింగ్​ వ్యాఖ్యలకూ.. పార్టీకి ఎలాంటి సంబంధం లేదని భాజపా అధికారిక లేఖ విడుదల చేసింది. అది ఆమె వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: ములాయం, మాయ ఐక్యరాగం- మోదీపై ధ్వజం

ABOUT THE AUTHOR

...view details