భాజపా ఎంపీ సాద్వీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ నివాసంలో కొన్ని లేఖలు కలకలం సృష్టించాయి. ఉర్దూ రాతలతో ఉన్న ఆ లేఖల కవర్లలో హానికారక రసాయనాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు ప్రగ్యా.
ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. లేఖలను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షకు పంపించారు.
"ఎంపీ నుంచి మాకు ఫిర్యాదు అందింది. కొన్ని హానికారక రసాయనాలు ఉన్న లేఖలు వచ్చాయని ఆమె చెప్పారు. వాటిని ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపాం. నివేదిక వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తాం."
- ఇర్షద్ వలీ, డీఐజీ, భోపాల్