తెలంగాణ

telangana

ఎంపీ ప్రగ్యాకు హానికారక రసాయనాలతో లేఖలు!

భాజపా ఎంపీ సాద్వీ ప్రగ్యా సింగ్​ ఠాకూర్​ నివాసానికి హానికారక రసాయనాలతో ఉన్న లేఖలు వచ్చాయని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆ లేఖలను ఫోరెన్సిక్​ పరీక్షకు పంపారు.

By

Published : Jan 14, 2020, 5:01 AM IST

Published : Jan 14, 2020, 5:01 AM IST

MP-PRAGYA-ENVELOPES
MP-PRAGYA-ENVELOPES

భాజపా ఎంపీ సాద్వీ ప్రగ్యా సింగ్​ ఠాకూర్​ నివాసంలో కొన్ని లేఖలు కలకలం సృష్టించాయి. ఉర్దూ రాతలతో ఉన్న ఆ లేఖల కవర్లలో హానికారక రసాయనాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు ప్రగ్యా.

ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. లేఖలను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్​ పరీక్షకు పంపించారు.

"ఎంపీ నుంచి మాకు ఫిర్యాదు అందింది. కొన్ని హానికారక రసాయనాలు ఉన్న లేఖలు వచ్చాయని ఆమె చెప్పారు. వాటిని ఫోరెన్సిక్​ పరీక్ష కోసం పంపాం. నివేదిక వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తాం."

- ఇర్షద్​ వలీ, డీఐజీ, భోపాల్​

ఇది కొత్తేమీ కాదు: ప్రగ్యా

దేశ వ్యతిరేక శక్తులే ఈ కుట్రకు పాల్పడ్డారని ప్రగ్యా ఠాకూర్​ ఆరోపించారు.

"ఈ లేఖలు ఉర్దూలో రాసి ఉన్నాయి. దానికి మరికొన్ని లేఖలు అనుసంధానం చేసి ఉన్నాయి. ఇలాంటి లేఖలు ఇంతకుముందు కూడా నాకు అందాయి. పోలీసులకు తెలిపినా వారు ఎలాంటి చర్య తీసుకోలేదు. ఈ కుట్రకు పాల్పడింది దేశ వ్యతిరేక శక్తులే."

-ప్రగ్యా ఠాకూర్​, భాజపా ఎంపీ

ABOUT THE AUTHOR

...view details