తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రూపాయి ఆదాయంలో 70 పైస‌లు పన్నులే - income sources

2019-20 మధ్యంత‌ర బ‌డ్జెట్ ప్ర‌కారం ప్రభుత్వానికి వచ్చే ప్రతి రూపాయిలో 70 పైసలు పన్నుల ద్వారా సమకూరనుంది.

పీయూష్​గోయల్

By

Published : Feb 1, 2019, 9:16 PM IST

కేంద్రం ఇవాళ ప్ర‌వేశపెట్టిన 2019-20 మధ్యంత‌ర బ‌డ్జెట్ ప్ర‌కారం ప్రభుత్వానికి వచ్చే ప్రతి రూపాయిలో 70 పైసలు పన్నుల ద్వారా సమకూరనుంది. ఇందులో 21 పైసలతో వస్తు సేవల పన్ను(జీఎస్​టీ) అతిపెద్ద ఆదాయ వనరుగా ఉండనుందని ఆర్థిక మంత్రి తన బడ్జెట్​ ప్రసంగంలో తెలిపారు.

మిగతా వాటిలో కేంద్ర ఎక్సైజ్​ సుంకం ద్వారా 7 పైసలు, ప్ర‌భుత్వ ఆస్తుల ద్వారా 19 పైస‌లు, పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ ద్వారా 8 పైస‌లు, మూలధ‌న లాభాలు 3 పైస‌లుగా ఉండనున్నాయి. కార్పొరేట్ల స‌మీక‌ర‌ణ‌ ఆదాయం 21 పైస‌లు, ఆదాయ‌పు ప‌న్ను 17 పైస‌ల‌ు కాగా....క‌స్ట‌మ్స్ సుంకం ద్వారా 4 పైస‌లు ఆర్జించనుంది.

కేంద్ర ప్రభుత్వ వ్యయం

2019-20 సంవత్సరానికి రూ. 27.84 లక్షల కోట్ల బడ్జెట్​ను ప్రభుత్వం లోక్​సభలో ప్రవేశపెట్టింది. మొదటి సారిగా దేశ రక్షణ బడ్జెట్ రూ. 3 లక్షల కోట్లు చేరింది. ఈ శాఖకు గత సంవత్సరం కేటాయింపులు సవరించిన అంచనాల ప్రకారం రూ. 2.85 లక్షల కోట్లు.

కేంద్రప్రభుత్వ వ్యయం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details