తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ ఘర్షణలపై గందరగోళం... రాజ్యసభ రేపటికి వాయిదా - RS adjourned for day, Oppn seeks immediate discussion on Delhi violence

ఈశాన్య దిల్లీలో చెలరేగిన ఘర్షణలపై పార్లమెంట్ ఉభయసభల్లో చర్చకు విపక్షసభ్యులు పట్టుబట్టారు. రాజ్యసభలో గందరగోళం నెలకొన్న కారణంగా ఛైర్మన్ వెంకయ్యనాయుడు సభను రేపటికి వాయిదా వేశారు. లోక్​సభలోనూ వాయిదాలు కొనసాగుతున్నాయి. దిల్లీ అల్లర్లపై చర్చించాలని దిగువసభ వేదికగా విపక్షసభ్యులు నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో సభను తొలుత 12, తర్వాత 2 గంటలకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు ప్యానెల్​ స్పీకర్​

parliament
దిల్లీ ఘర్షణలపై గందరగోళం... రాజ్యసభ రేపటికి వాయిదా!

By

Published : Mar 4, 2020, 11:59 AM IST

Updated : Mar 4, 2020, 12:18 PM IST

దిల్లీ ఘర్షణలపై విపక్షసభ్యులు చర్చకు పట్టుబడుతున్న కారణంగా పార్లమెంట్ కార్యకలాపాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. రాజ్యసభ కార్యకలాపాలు ప్రారంభమైన వెంటనే.. ఇటీవల మృతి చెందిన మాజీ సభ్యులకు ఎగువ సభ నివాళి అర్పించింది. అనంతరం ఛైర్మన్‌ వెంకయ్య నాయుడు ప్రశ్నోత్తరాలను ప్రారంభించగా దిల్లీ అల్లర్లపై చర్చకు విపక్షాలు డిమాండ్‌ చేశాయి. నినాదాలు చేస్తూ విపక్ష సభ్యులు అడ్డుతగిలిన కారణంగా శాంతించాలని వెంకయ్య పదేపదే విజ్ఞప్తి చేశారు. విపక్షాలు నినాదాలు కొనసాగించిన కారణంగా సభను రేపటికి వాయిదా వేశారు.

లోక్​సభలో వాయిదాల పర్వం..

లోక్​సభ ప్రారంభమైన వెంటనే ముందస్తు ప్రణాళిక మేరకు ఆయా సమస్యలపై చర్చను ప్రారంభించారు ప్యానెల్ స్పీకర్ కిరీట్ ప్రేమ్​భాయ్ సోలంకి. ఈ నేపథ్యంలో ఘర్షణలపై చర్చించాలని విపక్ష సభ్యులు పట్టుబట్టారు. తర్వాత అవకాశం కల్పిస్తామని.. ప్రణాళిక మేరకు సభ జరగనివ్వాలని ప్యానెల్ స్పీకర్ చేసిన విజ్ఞప్తి చేసినా సభ్యులు పట్టించుకోని కారణంగా 12 గంటలకు మొదటిసారి వాయిదా వేశారు. 12 గంటలకు సమావేశమైన అనంతరం కూడా సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రెండు గంటలకు వాయిదా పడింది.

ఇదీ చూడండి:రోజుకు 7 సార్లు రంగు మార్చే శివ లింగం!

Last Updated : Mar 4, 2020, 12:18 PM IST

ABOUT THE AUTHOR

...view details