తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తుపాకీతో బెదిరించి దొంగల ముఠా హల్​చల్​ - gang attack cctv

బెంగళూరులో ఓ దొంగల ముఠా బీభత్సం సృష్టించింది. ఇంటి యజమానిని తుపాకీతో బెదిరించి, రాళ్లతో కొట్టి... దోచుకున్న వస్తువులతో కారులో పరారైంది.

Robbery gang attack on a man in Bangalore:CCTV video
తుపాకీతో బెదిరించి దొంగల ముఠా హల్​చల్​

By

Published : Oct 18, 2020, 4:25 PM IST

తుపాకీతో బెదిరించి దొంగల ముఠా హల్​చల్​

కర్ణాటక బెంగళూరు పుత్తెనహళ్లి లోని మైకో లేఅవుట్​లో ఓ దొంగల ముఠా హల్​చల్ చేసింది. కార్లో వచ్చిన ముగ్గురు దుండగులు శ్రీహరి ప్రసాద్ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డారు. విలువైన వస్తువుల్ని కార్లోకి తరలించటం ప్రారంభించారు. వెంటనే అప్రమత్తమైన పక్కింటి వ్యక్తి... ఇంటి యజమానికి సమాచారం ఇచ్చాడు. అక్కడకు చేరుకున్న శ్రీహరి ప్రసాద్​ను దుండగులు తుపాకీతో బెదిరించారు. రాళ్లతో ఆయనపై దాడి చేసి, కారులో పరారయ్యారు.

ఈ ఘటనలో శ్రీహరి ప్రసాద్​కు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన ఓ ప్రైవేట్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సీసీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా పుత్తెనహళ్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details