తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శవాలతో విద్యార్థుల ఆందోళన.. అక్కడేం జరిగింది?

ఒడిశా నబరంగ్​పుర్​ జిల్లాకు చెందిన ఆదర్శ విద్యాలయ్​ పాఠశాల విద్యార్థులు.. రోడ్డు ప్రమాదాలపై వినూత్న రీతిలో నిరసన తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపిస్తూ.. రహదారులను వెంటనే బాగు చేయాలని డిమాండ్​ చేశారు.

By

Published : Mar 10, 2020, 6:48 PM IST

Updated : Mar 10, 2020, 7:40 PM IST

road safety awareness death act on road
శవాలతో విద్యార్థుల ఆందోళన.. అక్కడేం జరిగింది?

శవాలతో విద్యార్థుల ఆందోళన.. అక్కడేం జరిగింది?

దేశంలో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటున్నాయి. వీటిల్లో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్ల వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పరిస్థితులపై ఒడిశా విద్యార్థులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు.

రోడ్డుపై మృతదేహాలు...

ఒడిశా నబరంగ్​పుర్​ జిల్లాలో రోడ్లు అత్యంత దారుణ పరిస్థితుల్లో ఉన్నాయి. ముఖ్యంగా జిల్లాలోని ఉమర్​కోట్​ నుంచి రాయ్​గఢ్​.. అక్కడి నుంచి ఒడిశా సరిహద్దు ప్రాంతానికి వెళ్లే రోడ్లు మరీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. దీని వల్ల అనేక మరణాలు సంభవిస్తున్నాయి. వీటికి నిరసనగా ఆదర్శ విద్యాలయ్​ పాఠశాల విద్యార్థులు.. రోడ్డుపై ఓ నాటికను ప్రదర్శించారు.

ఈ డ్రామాలో.. రక్తపు మడుగులో కొంతమంది విద్యార్థులు రోడ్డుపై పడి ఉన్నారు. పెద్దపెద్ద గాయాలతో వీరు అచేతన స్థితిలో ఉండగా.. మరికొందరు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. రోడ్డు ప్రమాదాలను అశ్రద్ధ చేయవద్దని.. రహదారులకు మరమ్మత్తు చేయాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి:-'అల్లుడు గారూ... గాడిదపై ఎక్కండి మర్యాదలు చేస్తాం!'

Last Updated : Mar 10, 2020, 7:40 PM IST

ABOUT THE AUTHOR

...view details