తెలంగాణ

telangana

By

Published : Jan 27, 2020, 3:03 PM IST

Updated : Feb 28, 2020, 3:39 AM IST

ETV Bharat / bharat

సరిహద్దులో స్వీట్లు పంచుకోని భారత్​-పాక్ సైనికులు

గణతంత్ర దినోత్సవం రోజున నియంత్రణ రేఖ వద్ద భారత్​-పాక్​ సైనికులు మధ్య ఎటువంటి స్వీట్ల పంపకాలు జరగలేదని సైనిక అధికారులు స్పష్టం చేశారు. పాక్​ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుండటం వల్ల భారత సైనికులు కొన్నేళ్లుగా సరిహద్దు వద్ద స్వీట్లు పంపిణీకి దూరంగా ఉంటున్నారు.

Republic Day: No exchange of sweets with Pakistan at LoC, IB
సరిహద్దులో స్వీట్లు పంచుకోని భారత్​-పాక్ సైనికులు

ఇరు దేశాల్లోని జాతీయ పండుగలకు భారత్​, పాకిస్థాన్​ సరిహద్దుల్లోని సైనికులు స్వీట్లు పంచుకోవడం ఆనవాయితీ. అయితే దాయాది దేశం ఉగ్రవాదాన్ని పెంచిపోస్తుండటం.. తరుచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో కొన్నేళ్లుగా భారత​ సైనికులు స్వీట్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం లేదు. తాజాగా పూంచ్​ జిల్లాలో పాక్​ దళాల దాడులను నిరసిస్తూ అదివారం జరిగిన గణతంత్ర వేడుకల్లో సైతం ఆనవాయితీగా వస్తున్న కార్యక్రమాన్ని విరమించుకున్నట్లు సైనిక అధికారులు వెల్లడించారు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జమ్ముకశ్మీర్​లోని ఆర్మీ క్యాంపుల వద్ద భద్రతా దళాల ఉన్నతాధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు.

బీఎస్​ఎఫ్​ ప్రధాన కార్యాలయంలో ఐజీ ఎన్ఎస్​ జమ్​వాల్​ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం బీఎస్​ఎఫ్ అస్పత్రిని సందర్శించి గాయపడిన సైనికులకు పండ్లు, స్వీట్లను పంచారు.

137మందికి పతకాలు..

జమ్ము సెక్టార్​లోని సీఆర్​పీఎఫ్​ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఐజీ చారు సిన్హా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శౌర్య పతకాలకు ఎంపికైన సీఆర్​పీఎఫ్​ జవాన్ల పేర్లను చదివి వినిపించారు. 75 మంది పోలీస్​ పతకాలు, ఆరుగురు ప్రెసిడెంట్​ పోలీస్​ మెడల్స్​​, 56 మంది విశిష్ట సేవా పతకాలకు ఎంపికైనట్లు ప్రకటించారు.

ఉగ్రవాదాన్ని నిర్మూలించటంలో సీఆర్​పీఎఫ్​ కీలక పాత్ర పోషిస్తుందని ఐజీ వెల్లడించారు. జమ్ములోని 10 జిల్లాల్లో గణతంత్ర దినోత్సవాన్ని పోలీసులు, భద్రతాదళాలు ఘనంగా నిర్వహించాయి.

ఇదీ చదవండి:ఆ చిన్నారి జ్ఞాపక శక్తికి అవార్డులు దాసోహం.. ఏడేళ్లకే డాక్టరేట్​

Last Updated : Feb 28, 2020, 3:39 AM IST

ABOUT THE AUTHOR

...view details