తెలంగాణ

telangana

'వారి వ్యాఖ్యలు భాజపా భావజాలానికి వ్యతిరేకం'

గాడ్సేకు అనుకూలంగా కొందరు కమలనాథులు చేసిన వ్యాఖ్యలు పార్టీ భావజాలానికి వ్యతిరేకమని భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. సాధ్వీ ప్రజ్ఞాసింగ్, అనంత్​కుమార్ హెగ్దే, నళిన్​ కటీల్​ ప్రకటనలు వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమేనన్నారు.

By

Published : May 17, 2019, 2:36 PM IST

Published : May 17, 2019, 2:36 PM IST

Updated : May 17, 2019, 9:28 PM IST

అమిత్​ షా

భాజపా నేతలు సాధ్వీ ప్రజ్ఞాసింగ్, అనంత్​కుమార్ హెగ్దే, నళిన్​ కటీల్​ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ అధ్యక్షుడు స్పష్టతనిచ్చారు. అవి వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమేనని, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించి క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించామన్నారు.

"వారి వ్యాఖ్యలు వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. అందులో భాజపాకు ఎలాంటి సంబంధం లేదు. వారి మాటలను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పారు. అయినా పార్టీ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. ఇలాంటి మాటలు భాజపా భావజాలానికి, ప్రజాజీవనానికి పూర్తిగా వ్యతిరేకం. అందుకే వారిపై అంతర్గత విచారణ కమిటీని ఏర్పాటు చేశాం. ముగ్గురి నుంచి వివరణలు తీసుకున్నాక కమిటీ పదిరోజుల్లో నివేదిక సమర్పిస్తుంది."

-అమిత్ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు

గాడ్సే దేశభక్తుడని గురువారం మాట్లాడిన సాధ్వీ ప్రజ్ఞ... వివాదానికి కారణమయ్యారు. అనంతరం గాడ్సే విషయం తెరపైకి రావటం సంతోషంగా ఉందని అనంత్​కుమార్ హెగ్దే ట్వీట్​ చేశారు. విమర్శల నేపథ్యంలో ట్విట్టర్​ ఖాతా హ్యాక్​ అయిందని ప్రకటించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని గాడ్సేతో పోల్చుతూ కర్ణాటక ఎంపీ కటీల్​ ట్వీట్​ చేశారు.

ఇదీ చూడండి: క్షమాపణలు చెప్పిన సాధ్వి- నివేదిక కోరిన ఈసీ

Last Updated : May 17, 2019, 9:28 PM IST

ABOUT THE AUTHOR

...view details