తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రాహుల్​ గాంధీ ఆరోపణలు నిరాధారం'

అనిల్​ అంబానీపై రాహుల్​ గాంధీ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని రిలయన్స్​ గ్రూప్స్​ ప్రకటించింది. పదేళ్ల యూపీఏ పాలనలోనే సంస్థకు రూ.లక్ష కోట్ల విలువైన కాంట్రాక్టులు లభించాయని గుర్తుచేసింది. ఆరోపణలు నిజమైతే అంబానీకి అప్పుడు ఎందుకు మద్దతిచ్చారని ప్రశ్నించింది.

By

Published : May 5, 2019, 9:55 PM IST

'రాహుల్​ గాంధీ ఆరోపణలు నిరాధారం'

రిలయన్స్​ గ్రూపుల​ ఛైర్మన్​ అనిల్​ అంబానీపై కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ చేసిన ఆరోపణలను ఆ సంస్థ ఖండించింది. కాంగ్రెస్​ అధ్యక్షుడి ఆరోపణలు నిరాధారమైనవని వెల్లడించింది. నిరాధార, అసత్య, తప్పుడు సమాచారాలతో తమ సంస్థను ప్రస్తావిస్తూ రాహుల్​ ఎన్నికల ప్రచారాలు సాగిస్తున్నారని విమర్శించింది.

యూపీఏ​ హయాంలోనే విద్యుత్​, టెలికాం​, రహదారులు, మెట్రో ప్రాజెక్టులకు సంబంధించి రూ.లక్ష కోట్ల విలువైన కాంట్రాక్టులు తమ సంస్థకు వచ్చాయని రిలయన్స్​ తెలిపింది.

అనిల్​ అంబానీ నిజాయితీ లేని వ్యాపారి అని రాహుల్​ ఆరోపించారు. రాహుల్​ ఆరోపణలపై స్పందించిన రిలయన్స్​ గ్రూప్స్​... అది నిజమైతే పదేళ్ల యూపీఏ పాలనలో తమ సంస్థకు ఎందుకు మద్దతిచ్చారని ప్రశ్నించింది.

ఇదీ చూడండి: "యూపీ నుంచి మనుషుల్ని రప్పించి చితకబాదుతాం"

ABOUT THE AUTHOR

...view details