ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)ల పనితీరుపై కాంగ్రెస్ పార్టీ మరోమారు అనుమానాలను వ్యక్తం చేసింది. ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించే విషయమై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ.
"ప్రతి ఒక్కరు ఈవీఎంలపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది తీవ్రమైన సమస్య. అమెరికా లాంటి చాలా దేశాలు ఈవీఎంలను వినియోగించి తిరిగి బ్యాలెట్ ఓటింగ్కే మొగ్గుచూపాయి. అభ్యంతరాలు ఉన్నప్పుడు ఈవీఎంలను తొలగించి బ్యాలెట్కు తిరిగి వెళ్లాలి. ఎన్నికల ప్రక్రియపై తలెత్తిన ఈ ప్రశ్నపై ప్రజాభిప్రాయం సేకరించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నా. ఆ పనిని ప్రభుత్వం తప్పకుండా చేయాలనుకుంటున్నా. ప్రజాభిప్రాయాన్ని కూడా యంత్రాల ద్వారా కాకుండా బ్యాలెట్ ద్వారా సేకరించాలి."