తెలంగాణ

telangana

By

Published : Jul 15, 2020, 5:11 PM IST

ETV Bharat / bharat

రికార్డు స్థాయిలో కరోనా టెస్టులు- ఒక్కరోజే 3.2 లక్షలు

దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో వైరస్​ పరీక్షలను ముమ్మరం చేసింది కేంద్రం. మంగళవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 3 లక్షలకుపైగా కొవిడ్​ పరీక్షలు నిర్వహించింది. దీంతో జులై 14 వరకు చేసిన పరీక్షల సంఖ్య మొత్తం 1.24కోట్లకు చేరింది.

Record number of samples tested for COVID-19 on Tuesday: ICMR officials
రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు.. ఒక్కరోజే 3.2 లక్షలు

కొవిడ్​ పరీక్షలను వేగవంతం చేసింది కేంద్రం. మంగళవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 3,20,161 వైరస్​ నమూనాలు పరీక్షించినట్లు వెల్లడించింది. దీంతో జులై 14 నాటికి చేసిన మొత్తం పరీక్షల సంఖ్య 1,24,12,664కు పెరిగిందని భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్​) తెలిపింది.

మార్చి 25 నాటికి ఒక్కరోజులో నిర్వహించే కొవిడ్​ పరీక్షల సంఖ్య సగటున 1.5 లక్షలు ఉండేది. ప్రస్తుతం ఇది 4 లక్షల చేరువలో ఉన్నట్లు ఐసీఎంఆర్​ వైద్యులు తెలిపారు.

అందులో గోవా ఫస్ట్​..

వైరస్ అనుమానితులను గుర్తించడానికి ప్రతి మిలియన్​ జనాభాలో రోజుకు 140 మంది పరీక్షించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) సూచించింది. అయితే 22 రాష్ట్రాల్లో సగటున 140కి పైగా పరీక్షలు జరుగుతున్నాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటిల్లో గోవా, దిల్లీ, తమిళనాడు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.

ప్రతి 10 మిలియన్ల మందికి ఏ రాష్ట్రంలో ఎన్ని టెస్టులు...

రాష్ట్రం టెస్టులు
గోవా 1,058
దిల్లీ 978
తమిళనాడు 563
అసోం 310
కర్ణాటక 297
మధ్యప్రదేశ్ 249
ఝార్ఖండ్ 242
రాజస్థాన్​ 235
మహారాష్ట్ర 198

కరోనా పరీక్షలు ఎక్కువగా చేయడం వల్ల ఒక్కరోజులో నమోదవుతున్న వైరస్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. మంగళవారం రికార్డు స్థాయిలో 29 వేల 429 మంది కొవిడ్​ బారినపడ్డారు.

ఇదీ చూడండి:టార్గెట్ సచిన్... కాంగ్రెస్ కీలక నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details