విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థుల్లో ఎక్కువ మంది లండన్నే ఎంచుకుంటున్నారు. 2018-19 విద్యా సంవత్సరంలో అక్కడి విశ్వవిద్యాలయాల్లో చేరిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అంతకుముందు ఏడాదితో పోల్చితే ఏకంగా 34.7 శాతం మంది పెరగడం గమనార్హం. ఈ క్రమంలో లండన్ మూడో అతిపెద్ద అంతర్జాతీయ విద్యార్థి మార్కెట్గా భారత్ నిలిచినట్లు యూకేకు చెందిన ఉన్నత విద్యా గణాంక సంస్థ(హెచ్ఈఎస్ఏ) బుధవారం వెల్లడించింది. చైనా, అమెరికా మొదటి రెండు, ఇటలీ, ఫ్రాన్స్ నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నట్లు తెలిపింది.
రెండేళ్ల పోస్ట్ స్టడీ వీసా
యూకే ప్రభుత్వం ఇటీవల అంతర్జాతీయ విద్యార్థుల కోసం రెండేళ్ల పోస్ట్ స్టడీ వీసాను ప్రవేశపెట్టింది. విదేశీ గ్రాడ్యుయేట్ల ఉపాధికి ఎక్కువ సమయం కేటాయించటానికి వీలు కల్పిస్తుండటంతో అడ్మిషన్లు పెరిగినట్లు హెచ్ఈఎస్ఏ నివేదిక చెబుతోంది.