తెలంగాణ

telangana

By

Published : Aug 13, 2019, 3:28 PM IST

Updated : Sep 26, 2019, 9:09 PM IST

ETV Bharat / bharat

'అనర్హత వేటుపై అత్యవసర విచారణకు విజ్ఞప్తి'

అనర్హత వేటును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు కర్ణాటక రెబల్​ ఎమ్మెల్యేలు. పిటిషన్​పై అత్యవసర విచారణ చేపట్టాలని కోరారు. పరిశీలించిన ధర్మాసనం రిజిస్ట్రార్​కు మెమో అందజేయాలని సూచించింది.

సుప్రీం కోర్టుకు కర్ణాటక రెబల్​ ఎమ్మెల్యేలు

కర్ణాటక కాంగ్రెస్​-జేడీఎస్​ రెబల్​ ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అనర్హత వేటును సవాలు చేస్తూ తాము వేసిన పిటిషన్​పై అత్యవసర విచారణ చేపట్టాలని కోరారు. ఈనెల 19న వాదనలు వినాలని అభ్యర్థించారు.

జస్టిస్​ అరుణ్​ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఎమ్మెల్యేల పిటిషన్​ను పరిశీలించింది. అత్యవసర విచారణ చేపట్టేందుకు మెమోను రిజిస్ట్రార్​కు అందించాలని ఎమ్మెల్యేల తరఫు న్యాయవాది ముకుల్​ రోహత్గీని ఆదేశించింది.

జులై 29న కర్ణాటక విధాన సభలో జరిగిన విశ్వాస పరీక్షలో కుమారస్వామి సర్కారు పడిపోయి.. భాజపా నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు అప్పటి స్పీకర్​ రమేశ్​ కుమార్​.

ఇదీ చూడండి: మరో 25 ఏళ్లకు కశ్మీర్​ రహిత భారత్​: వైగో

Last Updated : Sep 26, 2019, 9:09 PM IST

ABOUT THE AUTHOR

...view details