తెలంగాణ

telangana

By

Published : Sep 26, 2020, 6:05 AM IST

ETV Bharat / bharat

రెండు దేశాలతోనూ ఒకేసారి యుద్ధానికి సిద్ధం!

దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొవడానికైనా సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది వైమానిక దళం. పాక్​, చైనాలతో ఒకేసారి యుద్ధం చేయడానికి తగిన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

Ready for undertaking operations on both China, Pakistan fronts: IAF
రెండు దేశాలతోనూ యుద్ధానికి సిద్ధం!

చైనా, పాకిస్థాన్​ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత వైమానిక దళం కీలక ప్రకటన చేసింది. చైనా, పాక్​లు కలిసిన భారత్​పై ఒకేసారి యుద్ధానికి వచ్చినా... ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. అందుకోసం పూర్తిస్థాయి సన్నాహాలు చేసినట్లు అధికారులు తెలిపారు.

పాక్ సరిహద్దుకు 50 కిలోమీటర్లు దూరంలో అత్యంత వ్యూహాత్మక ప్రాంతం దౌలత్​ బేగ్​ ఓల్డీలోని వైమానిక స్థావరం. ఇక్కడి నుంచి 80 కిలోమీటర్ల​ పరిధిలో యుద్ధ విమానాలు చక్కర్లు కొడుతూ.. రేయింబవళ్లు గస్తీ కాస్తున్నాయి. సుఖోయ్‌ 30 సహా పలు అత్యాధునిక యుద్ధ విమానాలు మోహరించినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:బిహార్​ ఎన్నికల ఫైట్​​: ఎవరి సత్తా ఎంత..?

ABOUT THE AUTHOR

...view details