చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దేశ ప్రజలు అభద్రతా భావంతో ఉన్నారని చెప్పారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రజల విశ్వాసం అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయిందన్నారు. ద్రవ్యపరపతి విధాన ప్రకటనను ఉద్దేశిస్తూ... ప్రజల మానసిక స్థితిని ఆర్బీఐ వెల్లడించిందని ట్వీట్ చేశారు.
" భారతదేశ వాస్తవ స్థితిని ఆర్బీఐ వెల్లడించింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లింది. భయం, అభద్రతా భావంతో ఉన్నారు. ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాలకు సంబంధించి ఇంకా బాధాకరమైన వార్తాలు వినాల్సి రావచ్చు."
-రాహుల్ ట్వీట్.