తెలంగాణ

telangana

By

Published : Nov 4, 2019, 1:15 PM IST

Updated : Nov 4, 2019, 4:00 PM IST

ETV Bharat / bharat

'మహా' ఉత్కంఠ: 'విజయం ముంగిట శివసేన'..!

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన సన్నద్ధమవుతుందనే ఊహాగానాలకు ఆ పార్టీ నేతల వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి. ఈ రోజు సాయంత్రం గవర్నర్​ను కలవనున్న శివసేన నేత సంజయ్​ రౌత్​... విజయానికి చేరువలో ఉన్నామనే అర్థం వచ్చేలా ట్వీట్​ చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు భాజపా సిద్ధంగా ఉందని.. షాతో భేటీ అనంతరం ఫడణవీస్​ పేర్కొన్నారు.

'మహా' ఉత్కంఠ: 'విజయం ముంగిట శివసేన'..!

'మహా' ఉత్కంఠ: 'విజయం ముంగిట శివసేన'..!

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధం నెలకొన్న వేళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు శివసేన నేత, ఎంపీ సంజయ్​ రౌత్. భాజపాతో మైత్రిలో ప్రతిష్టంభన ఏర్పడిన నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం మహారాష్ట్ర గవర్నర్​ను కలవనున్నారు రౌత్​.

ఈ సమయంలో ట్విట్టర్​లో శివసేన అధినేత ఉద్ధవ్​ ఠాక్రేతో ఉన్న చిత్రం పోస్ట్​ చేస్తూ.. విజయం సాధిస్తున్నట్లు పేర్కొవటం ప్రాధాన్యం సంతరించుకుంది.

"విజయానికి ముందు పడిన కష్టం ఎంతో మజాను ఇస్తుంది. జైహింద్​."

-సంజయ్​ రౌత్, శివసేన ఎంపీ

ఇందులో మరో ఆశ్చర్యకరమైన విషయం ఉంది. 'జైహింద్'​ అంటూ అభిమానులను పలకరించారు రౌత్​. సాధారణంగా 'జై మహారాష్ట్ర' నినాదాన్నే శివసేన ఉపయోగిస్తుంది. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు 170 మంది మద్దతు ఉందని శనివారం ప్రకటించారు రౌత్. ఈ ప్రకటన తర్వాత గవర్నర్​ను సంజయ్​ రౌత్​ కలవనుండటం మహారాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది.

దిల్లీకి చేరిన 'మహా' రాజకీయాలు..

శివసేన సంచలన ప్రకటన నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాలు రాజధాని దిల్లీకి చేరాయి. భాజపా అధ్యక్షుడు అమిత్​ షాతో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఇప్పటికే భేటీ అయ్యారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు భాజపా సిద్ధంగా ఉందని.. త్వరలోనే కొత్త సర్కార్​ ఏర్పాటవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుపై ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా.. తమకు సంబంధం లేదని పరోక్షంగా శివసేనను ఉద్దేశించి అన్నారు ఫడణవీస్​.

మరోవైపు ఎన్సీపీ అధినేత శరద్​ పవార్​... కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఇవాళ సమావేశం కానున్నారు.

ఇదీ చూడండి : ఇండిగో సర్వర్ డౌన్​​... ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు

Last Updated : Nov 4, 2019, 4:00 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details