తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అత్యాచార బాధితురాలికి నిప్పు అంటించిన రాక్షసులు - అత్యాచార బాధితురాలు సజీవ దహనం

ఉత్తర్​ప్రదేశ్​ ఉన్నావ్​లో అత్యాచార బాధితురాలిపై హత్యాయత్నం జరిగింది. ఐదుగురు దుండగులు ఆమెకు నిప్పంటించారు. బాధితురాలు ప్రస్తుతం లఖ్​నవూ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

Rape victim set ablaze by 5 men in UP
అత్యాచార బాధితురాలిని సజీవ దహనం చేసిన రాక్షసులు

By

Published : Dec 5, 2019, 11:42 AM IST

Updated : Dec 5, 2019, 11:55 AM IST

హైదరాబాద్​ షాద్​నగర్​ విషాదం నుంచి తేరుకోకముందే ఉత్తర్​ప్రదేశ్​ ఉన్నావ్​లో అత్యాచార బాధితురాలిపై హత్యాయత్నం జరిగింది. ఐదుగురు దుండగులు ఈ ఘాతుకానికి తెగబడ్డారు. మార్చిలో ఆమెపై అత్యాచారం చేసి, బెయిల్​పై విడుదలైన నిందితుడు... ఆ ఐదుగురు కిరాతకుల్లో ఒకడు.

అత్యాచార బాధితురాలికి నిప్పు అంటించిన రాక్షసులు

బిహార్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని సింధ్​పుర్​ గ్రామంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలి శరీరం దాదాపు పూర్తిగా కాలిపోయినట్లు సమాచారం. అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఉన్న ఆమెను మెరుగైన వైద్యం కోసం లఖ్​నవూ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

"నిందితుల్లో నలుగుర్ని అరెస్ట్​ చేశాం. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నాం. తనను అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఇంతకుముందే ఫిర్యాదు చేసింది."
- పోలీసు అధికారి

ప్రియాంక ఆగ్రహం...

ప్రియాంక గాంధీ ట్వీట్

"ఉత్తర్​ప్రదేశ్​లో చట్టాలు చాలా బాగా పనిచేస్తున్నాయని కేంద్ర హోంమంత్రి, రాష్ట్ర​ ముఖ్యమంత్రి తరచూ అసత్యాలు చెబుతున్నారు. కానీ ఆడవారిపై రోజూ జరుగుతున్న అరాచకాలు చూస్తుంటే గుండె రగిలిపోతోంది. ఇప్పటికైనా భాజపా నాయకులు కళ్లు తెరవాలి."
- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్​ జాతీయ ప్రధాన కార్యదర్శి

Last Updated : Dec 5, 2019, 11:55 AM IST

ABOUT THE AUTHOR

...view details