ప్రధాని నరేంద్ర మోదీని హత్య చేయడానికి కుట్ర పన్నుతున్నారంటూ వచ్చిన వార్త కలకలం రేపింది. ఈ మేరకు ఝార్ఖండ్ రాజధాని రాంచీలో ఓ లేఖ బహిర్గతమైనందున నిఘావర్గాలు అప్రమత్తమయ్యాయి. సమాచారం అందుకున్న జాతీయ దర్యాప్తు సంస్థ, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు రాంచీ చేరుకున్నారు. లేఖ స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
రాంచీ మహిళ లేఖ
రాంచీకి చెందిన 'నయా సరయ్' అనే మహిళ రాయ్పుర్జాతీయ దర్యాప్తు సంస్థ కార్యాలయానికి లేఖ పంపినట్లు అధికారులు తెలిపారు. మూడేళ్ల క్రితం నుంచి తన అత్తామామలు మోదీ హత్యకు ప్రణాళికలు రచిస్తున్నారని లేఖలో మహిళ పేర్కొంది. ఇప్పటికీ ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపింది.