తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యోగా దినోత్సవ ప్రధాన వేదికగా 'రాంచీ'

ఝార్ఖండ్ రాజధాని రాంచీని అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రధాన వేదికగా కేంద్రం నిర్ణయించింది. ఈ వేడుకలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొంటారు. యోగాపై విస్తృత ప్రచారం చేసిన మీడియా సంస్థలకు పురస్కారాలు అందిస్తారు.

By

Published : Jun 8, 2019, 5:02 PM IST

యోగా దినోత్సవ ప్రధాన వేదికగా 'రాంచీ'

అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధాన వేదికగా ఝార్ఖండ్​ రాజధాని రాంచీని ఎంపిక చేసినట్లు ఆయుష్​ మంత్రిత్వశాఖ అధికారిక ప్రకటన చేసింది. జూన్​ 21న ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారని తెలిపింది.

రాంచీలోని ప్రభాత్​ తారా మైదానంలో జరిగే ఈ కార్యక్రమంలో సుమారు 30 వేల మంది పాల్గొంటారని ఆయుష్​ మంత్రిత్వశాఖ అంచనా వేస్తోంది. జూన్​ 13న జరిగే సన్నాహక కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, యోగా సంస్థలు, గురువులు పాల్గొంటారని తెలిపింది.

దిల్లీలో వేడుకలు...

దిల్లీలో యోగా ప్రధాన కార్యక్రమం రాజ్​పథ్​లో న్యూదిల్లీ మున్సిపల్​ కౌన్సిల్​ (ఎన్​ఎమ్​డీసీ) నిర్వహిస్తుందని ఆయుష్​ మంత్రిత్వశాఖ తెలిపింది. ఎర్రకోట, నెహ్రూపార్క్​, తదితర ప్రాంతాల్లోనూ యోగా వేడుకలు జరుగుతాయని వివరించింది.

మీడియాకు అవార్డులు

యోగాపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించిన ప్రసార మాధ్యమాలను సత్కరిస్తామని కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్​ జావడేకర్​ తెలిపారు. పత్రికలు, టీవీ, రేడియో ఛానళ్లకు 11 చొప్పున మొత్తం 33 అవార్డులు అందిస్తామని ఆయన తెలిపారు. జూన్ 10 నుంచి 25 వరకు యోగాపై చేసే ప్రచారాన్ని పరిగణనలోకి తీసుకుని అవార్డులు ప్రకటిస్తామని జావడేకర్ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: భారతీయ రైళ్లలో ఇక 'మసాజ్'​ సౌకర్యం

ABOUT THE AUTHOR

...view details