తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రఫేల్ అందిన వేళ రాజ్​నాథ్​సింగ్ 'ఆయుధపూజ' - Rajnath Singh

రక్షణమంత్రి రాజ్​నాథ్​సింగ్ సోమవారం నుంచి మూడు రోజులపాటు ఫ్రాన్స్​లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా డసో ఏవియేషన్ మంగళవారం భారత్​కు మొదటి రఫేల్​ యుద్ధవిమానాన్ని అందజేయనుంది. ఆ రోజు దసరా పండుగ కనుక రాజ్​నాథ్ అక్కడే ఆయుధపూజ చేయనున్నారు.

రఫేల్ అందిన వేళ రాజ్​నాథ్​సింగ్ 'ఆయుధపూజ'

By

Published : Oct 6, 2019, 11:40 PM IST

Updated : Oct 7, 2019, 3:21 AM IST

ఫ్రాన్స్​ నుంచి మొదటి రఫేల్​ యుద్ధ విమానం భారత్​ అమ్ములపొదిలో చేరనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం దసరా వేడుకల్లో భాగంగా రక్షణమంత్రి రాజ్​నాథ్​సింగ్ ఆయుధపూజ చేయనున్నారు. తర్వాత యుద్ధవిమానంలో ఆకాశవీధుల్లో చక్కర్లు కొట్టనున్నారు.

గత ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో హోంమంత్రిగా ఉన్నప్పుడు కూడా రాజ్​నాథ్​సింగ్ ఇలానే ఆయుధపూజ చేశారు.

ఫ్రాన్స్​లో పర్యటన

రాజ్​నాథ్​ సింగ్ రక్షణమంత్రి హోదాలో సోమవారం నుంచి మూడు రోజులపాటు ఫ్రాన్స్​లో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్​తో సమావేశమవుతారు. రక్షణ, భద్రత మొదలగు ద్వైపాక్షిక అంశాలను చర్చిస్తారు.

అనంతరం ఫ్రాన్స్​లోని బోర్డియాక్స్​కు రాజ్​నాథ్​ సింగ్ చేరుకుంటారు. డసో ఏవియేషన్​ రఫేల్ యుద్ధవిమానాన్ని భారత్​కు అందిస్తుంది. ఆ రోజు దసరా పండుగ కనుక.. రాజ్​నాథ్​ అక్కడే రఫేల్ జెట్​కు ఆయుధపూజ చేస్తారు. తరువాత ఆ యుద్ధవిమానంలో కొంతసేపు విహరిస్తారు.

భారత అమ్ములపొదిలో..

భారత్ 36 రఫేల్ యుద్ధవిమానాలను ఫ్రాన్స్​ నుంచి కొనుగోలుచేసింది. ఒప్పందంలో భాగంగా ఫ్రాన్స్ మొదటి రఫేల్ జెట్​ను మంగళవారం భారత్​కు అందించనుంది. అయితే మొదటి బ్యాచ్​లో భాగంగా నాలుగు విమానాలు మాత్రం వచ్చే ఏడాది మే నాటికి భారత్​కు వస్తాయి.

మేక్​ ఇండియా కోసం..

అక్టోబర్ 9న ప్రముఖ ఫ్రెంచ్​ రక్షణ సంస్థల సీఈఓలతో రాజ్​నాథ్​సింగ్ సమావేశమవుతారు. భారత రక్షణ రంగంలో 'మేక్​ ఇన్ ఇండియా'లో భాగస్వాములు కావాల్సిందిగా కోరనున్నారు.

ఇదీ చూడండి:పన్ను మదింపు సేవలు ఇక మరింత సులభం!

Last Updated : Oct 7, 2019, 3:21 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details