తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అప్పుడు మోదీ X సోనియా.. మరి ఇప్పుడు?'

సార్వత్రిక ఎన్నికల్లో భాజపా విజయభేరి మోగిస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీఏకి మూడింట రెండొంతుల మెజారిటీ ఖాయమన్న రాజ్​నాథ్​.. విపక్ష కూటమికి ప్రధాని అభ్యర్థి ఎవరో చెప్పాలని సవాల్​ విసిరారు.

By

Published : May 14, 2019, 4:47 PM IST

Updated : May 14, 2019, 7:33 PM IST

రాజ్​నాథ్​ సింగ్

విపక్షాలపై రాజ్​నాథ్ ధ్వజం

ప్రధాని అభ్యర్థి ఎవరో ప్రజలకు స్పష్టం చేయాలని విపక్ష కూటమికి సవాల్​ విసిరారు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్​నాథ్ సింగ్. పరిస్థితులను గమినిస్తే భాజపా విజయం తథ్యమని దిల్లీలో ధీమా వ్యక్తం చేశారు.

"2014తో పోలిస్తే ఈ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో భాజపా విజయం సాధిస్తుంది. ఎన్డీఏకి మూడింట రెండొంతుల మెజారిటీ ఎక్కడికీ పోదు. 2014లో ప్రధానిపై నమ్మకం ఉండేది. ఇప్పుడది భరోసాగా మారింది.

గత ఎన్నికల్లో నరేంద్ర మోదీ వర్సెస్​ సోనియా గాంధీ. ఈసారీ మోదీ ఉన్నారు. ఆ వైపు ఎవరు? ప్రజలతో దాగుడు మూతలు ఆడొద్దు. మీ ప్రధాని అభ్యర్థి ఎవరో చెప్పేయాలి."

-రాజ్​నాథ్ సింగ్, కేంద్ర హోంశాఖ మంత్రి

ఎస్పీ, బీఎస్పీ కూటమి నేతలకు మొదట ఉన్న నమ్మకం ఇప్పుడు లేదని ఎద్దేవా చేశారు రాజ్​నాథ్​. "కాషాయ తీవ్రవాదం" అంటూ ఉగ్రవాదంపై భారత్​ చేస్తున్న పోరుకు కాంగ్రెస్ అడ్డుపడుతోందని ఆరోపించారు. ఇలాంటి విషయాల్లో అన్ని పార్టీలు కలిసి పోరాడాల్సిన అవసరముందన్నారు.

మోదీ ప్రభుత్వం మూడు అంశాల్లో విజయం సాధించిందని తెలిపారు రాజ్​నాథ్. అంత్యోదయ, అభివృద్ధి, భద్రత రంగాల్లో పురోగతి సాధించామన్నారు.

ఇదీ చూడండి: మోదీ వివాహ బంధంపై మాయ తీవ్ర వ్యాఖ్యలు

Last Updated : May 14, 2019, 7:33 PM IST

ABOUT THE AUTHOR

...view details