ప్రధాని అభ్యర్థి ఎవరో ప్రజలకు స్పష్టం చేయాలని విపక్ష కూటమికి సవాల్ విసిరారు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. పరిస్థితులను గమినిస్తే భాజపా విజయం తథ్యమని దిల్లీలో ధీమా వ్యక్తం చేశారు.
"2014తో పోలిస్తే ఈ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో భాజపా విజయం సాధిస్తుంది. ఎన్డీఏకి మూడింట రెండొంతుల మెజారిటీ ఎక్కడికీ పోదు. 2014లో ప్రధానిపై నమ్మకం ఉండేది. ఇప్పుడది భరోసాగా మారింది.
గత ఎన్నికల్లో నరేంద్ర మోదీ వర్సెస్ సోనియా గాంధీ. ఈసారీ మోదీ ఉన్నారు. ఆ వైపు ఎవరు? ప్రజలతో దాగుడు మూతలు ఆడొద్దు. మీ ప్రధాని అభ్యర్థి ఎవరో చెప్పేయాలి."