భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసు దోషుల విడుదలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేయాలని దాఖలైన వ్యాజ్యాన్ని తిరస్కరించింది సుప్రీం కోర్టు.
తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆత్మహుతి దాడిలో మాజీ ప్రధానితో పాటు మరణించిన వారి బంధువులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దోషుల విడుదల నిలుపుదలకు ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ చేపట్టింది. రాజ్యాంగ ధర్మాసనం గత తీర్పులోనే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లు పేర్కొంది. ఈ కేసులో ఎలాంటి విచారణ అవసరం లేదని తేల్చింది.