తెలంగాణ

telangana

గుర్జర్ల ఆందోళనతో రైళ్ల రాకపోకలకు అంతరాయం

రిజర్వేషన్​కు రాజ్యాంగబద్ధత కల్పించాలన్న డిమాండ్​తో రాజస్థాన్​లో గుర్జర్లు నిరసన చేపట్టారు. ఫలితంగా కొన్ని చోట్ల రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

By

Published : Nov 1, 2020, 7:48 PM IST

Published : Nov 1, 2020, 7:48 PM IST

Rajasthan: Gurjar body starts stir over reservation
గుర్జార్​ రిజర్వేషన్​లపై ఆ రాష్ట్రంలో పెద్దఎత్తున ఆందోళనలు

రిజర్వేషన్​ వ్యవహారంలో రాజస్థాన్​లో గుర్జర్లు మరోమారు ఆందోళన బాటపట్టారు. భరత్​పుర్​లోని బయానాలో కొందరు యువకులు.. రైల్వేట్రాక్​పై బైఠాయించారు. ఫలితంగా హిణ్​డైన్​ సిటీ-బయానా మార్గంలో ప్రయాణించే 7 రైళ్లను దారి మళ్లించారు రైల్వే అధికారులు. ఈ ఆందోళనలతో దిల్లీ-ముంబయి రైలు మార్గంలో ట్రాఫిక్​పై ప్రభావం పడుతుందని చెప్పారు.

రిజర్వేషన్ల కోసం గుర్జర్ల ఆందోళనలు

గుర్జర్​​​ ఆరాక్షన్​ సంఘర్ష్​ సమితి ఈ ఆందోళనకు పిలుపునిచ్చింది. ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు కొన్ని జిల్లాల్లో జాతీయ భద్రతా చట్టాన్ని అమలు చేస్తున్నారు. పలు జిల్లాల్లో అంతర్జాల సేవలు నిలిపివేశారు.

గుర్జర్ల డిమాండ్​లివే..

  • రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్​ ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం గుర్జర్లకు రిజర్వేషన్లు కల్పించాలి.
  • ఖాళీల బ్యాక్​లాగ్​లను త్వరితగతిన భర్తీ చేసి, పెండింగ్​లో ఉన్న నియామక ప్రక్రియలో అత్యంత వెనుకబడిన తరగతుల(ఎంబీసీ) వారికి 5శాతం రిజర్వేషన్​ ఇవ్వాలి.
  • 14 పాయింట్ల ఒప్పందం ప్రకారం.. ప్రొబేషన్​ పీరియడ్​ పూర్తి చేసుకున్న 1,252 మంది ఉద్యోగులకు రెగ్యులర్​ పే స్కేల్​ ఆధారంగా వేతనాలివ్వాలి.

ఇదీ చదవండి:అరెస్టులకు దారితీసిన వల్లభ్​గఢ్​ మహాపంచాయతీ

ABOUT THE AUTHOR

...view details