తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైజీనా డైలాగ్​: అమెరికా-ఇరాన్​ ఉద్రిక్తతలపై చర్చ - రైజీనా డైలాగ్​

భౌగోళిక, రాజకీయ అంశాలపై భారత్​ నిర్వహిస్తున్న 'రైజీనా డైలాగ్​' దిల్లీలో మంగళవారం ప్రారంభమయింది. ప్రధాని మోదీతో పాటు డెన్మార్క్​, న్యూజిలాండ్ ప్రధానులు హాజరైన ఈ కార్యక్రమంలో ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు.

MEA-RAISINA DIALOGUE
MEA-RAISINA DIALOGUE

By

Published : Jan 15, 2020, 5:00 AM IST

Updated : Jan 15, 2020, 8:52 AM IST

భారత్​ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న రైజీనా సదస్సు దిల్లీలో మంగళవారం అట్టహాసంగా ప్రారంభమయింది. భౌగోళిక, రాజకీయ అంశాలపై 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు.

మోదీతో పాటు డెన్మార్క్ ప్రధాని అండర్స్ రసముసెన్, న్యూజిలాండ్ ప్రధాని హెలెన్​ క్లార్క్​, 7 దేశాల మాజీ అధినేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లు ముఖ్యంగా అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, ఆఫ్గాన్​ శాంతికి చొరవ, వాతావరణ మార్పులపై చర్చించారు.

ఇదీ చూడండి: నేటి నుంచి 'రైజీనా డైలాగ్'- ప్రారంభోత్సవానికి మోదీ

Last Updated : Jan 15, 2020, 8:52 AM IST

ABOUT THE AUTHOR

...view details