తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈశాన్యాన జోరు వర్షం- బ్రహ్మపుత్ర ఉగ్రరూపం - వర్షాలు

ఈశాన్య రాష్ట్రాల్లో కురుస్తోన్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. వరద బీభత్సానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొండ చరియలు విరిగిపడి సిక్కిం-డార్జిలింగ్ రహదారిపై రాకపోకలు నిలిచాయి. మిజోరంలోని టాబ్లాంగ్ పట్టణం నీటమునిగింది.

ఈశాన్యాన జోరు వర్షం- బ్రహ్మపుత్ర ఉగ్రరూపం

By

Published : Jul 12, 2019, 11:57 AM IST

ఈశాన్య రాష్ట్రాలను వర్షాలు వణికిస్తున్నాయి. బ్రహ్మపుత్ర నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నదీ పరివాహక ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వర్షాలు ఇలానే కొనసాగితే రెండు రోజుల్లో నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరే అవకాశం ఉందని ఓ అధికారి వెల్లడించారు.

సిక్కిం- డార్జిలింగ్ రహదారి బంద్!

కొద్ది రోజులుగా కురుస్తోన్న వర్షాలతో పశ్చిమ బంగ-సిక్కిం రాష్ట్రాలను కలిపే 10వ నెంబర్ జాతీయ రహదారిపై కొండ చరియలు విరిగిపడ్డాయి. ఫలితంగా రాకపోకలు నిలిచిపోయాయి.

నీటమునిగిన ట్లాబంగ్ పట్టణం

మిజోరంలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొద్ది రోజులుగా కురుస్తోన్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదల ధాటికి ట్లాబంగ్ పట్టణం నీట మునిగింది.

ఈశాన్యాన జోరు వర్షం- బ్రహ్మపుత్ర ఉగ్రరూపం

ఇదీ చూడండి: ఈ 'జైలు బిర్యానీ'కి మహా క్రేజ్​ గురూ!

ABOUT THE AUTHOR

...view details