బంగాల్ నోపరా- దక్షిణేశ్వర్ మెట్రో రైలు తొలి ట్రయర్ రన్ను బుధవారం విజయవంతంగా నిర్వహించింది భారతీయ రైల్వే. ఈ మేరకు ట్వీట్ చేశారు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్. ఈ మెట్రో రైలు పూర్తయితే లక్షల మంది రోజువారి ప్రయాణికులకు మేలు జరుగుతుందని వివరించారు. అంతేకాక దక్షిణేశ్వర్ కాళీ మాత దేవాలయానికి వచ్చే భక్తులు తేలిగ్గా ఆలయానికి చేరుకోవచ్చని వెల్లడించారు.
దక్షిణేశ్వర్ మెట్రో రైలు తొలి ట్రయల్ రన్ విజయవంతం - నోపరా మెట్రో
బంగాల్ దక్షిణేశ్వర్ కాళీ మాత ఆలయం వరకు నిర్మించిన మెట్రో రైలు మొదటి ట్రయల్ రన్ను విజయవంతంగా నిర్వహించింది భారతీయ రైల్వే. నోపరా నుంచి దక్షిణేశ్వర్ వరకు 4 కిలోమీటర్లు మేర ఈ ట్రయల్ రన్ చేపట్టారు అధికారులు.
![దక్షిణేశ్వర్ మెట్రో రైలు తొలి ట్రయల్ రన్ విజయవంతం Railways conducts 1st trial run of Metro train up to Dakshineswar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9980897-954-9980897-1608726976505.jpg)
దక్షిణేశ్వర్ మెట్రో రైలు ట్రయల్ రన్ విజయవంతం
దక్షిణేశ్వర్ మెట్రో రైలు ట్రయల్ రన్ విజయవంతం
నోపరా నుంచి కవి సుభాశ్ స్టేషన్ వరకు నిర్మిస్తున్న రైల్వే మార్గం మొత్తం 27.22 కిలోమీటర్లు ఉండగా.. అందులో 15.70 కిలోమీటర్లు భూగర్భం మార్గం ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ రైల్వే మార్గంలో మొత్తం 9 స్టేషన్లు ఉన్నాయని పేర్కొన్నారు.
ఇదీ చదవండి :టీఎంసీ- భాజపా నేతల ఘర్షణ.. పలువురికి గాయాలు