తెలంగాణ

telangana

By

Published : Sep 24, 2020, 5:51 PM IST

ETV Bharat / bharat

రైతన్నల రైల్​రోకో ఉద్ధృతం- సర్వీసుల నిలిపివేత

పార్లమెంటు ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి రైతు సంఘాలు. పంజాబ్​లో ఆందోళనలు ఉద్ధృతంగా సాగుతున్నాయి. ఫిరోజ్​పుర్​లో రైల్​రోకో చేపట్టగా.. ఆ డివిజన్​లో ప్రత్యేక రైలు సర్వీసులు నిలిపివేశారు అధికారులు. రైల్​రోకోతో ఆహార పదార్థాల రవాణాకు ఆటంకం కలుగుతున్నట్లు పేర్కొన్నారు.

'Rail roko' agitation starts in Punjab, train services suspended
ఆ బిల్లులను నిరసిస్తూ రైల్​రోకో.. సర్వీసులు నిలిపివేసిన రైల్వే

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ.. పంజాబ్​లో ఆందోళనలు ఉద్ధృతం చేస్తున్నారు రైతులు. రైల్వే ట్రాక్​పై నిరసనలకు దిగారు. సెప్టెంబర్​ 24-26 మధ్య 3 రోజుల పాటు రైల్​రోకో చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.

వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ రైతుల ఆందోళన
రైతుల ఆందోళన
వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ రైల్​రోకో

కిసాన్​ మజ్దూర్​ సంఘర్ష్​ కమిటీ.. రైల్‌రోకోకు పిలుపునివ్వగా పలు రైతు సంఘాలు మద్దతిచ్చాయి.

వ్యవసాయ బిల్లులపై రైతుల ఆగ్రహం

నిరసనల్లో భాగంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా బంద్​ నిర్వహించాలని నిర్ణయించాయి.

పట్టాలపై రైతుల బైఠాయింపు

రైల్వే ఆస్తులకు నష్టం..!

ఈ నేపథ్యంలో ఫిరోజ్​పుర్​ రైల్వే డివిజన్​లో ప్రత్యేక రైలు​ సర్వీసులను నిలిపివేశారు అధికారులు. ప్రయాణికుల భద్రత, రైల్వే ఆస్తులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రైల్‌రోకో కారణంగా అత్యవసర సరుకులు, ఆహార పదార్థాల రవాణాకు తీవ్ర ఆటంకం కలుగుతున్నట్లు చెప్పారు.

సీఐటీయూ ఆధ్వర్యంలో...

కర్ణాటకలోనూ వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ.. 'ఛలోవిధాన సౌధ' కార్యక్రమాన్ని చేపట్టింది సీఐటీయూ. బెంగళూరులోని ఫ్రీడం పార్క్​లో ధర్నా నిర్వహించింది. ఈ నిరసనలకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా
ఛలో విధాన సౌధ కార్యక్రమంలో సీఐటీయూ సభ్యులు

ABOUT THE AUTHOR

...view details