తెలంగాణ

telangana

By

Published : Apr 21, 2020, 3:01 PM IST

ETV Bharat / bharat

'ఆకలి చావులు పెరుగుతుంటే బియ్యంతో శానిటైజర్లా?'

బియ్యంతో శానిటైజర్లు తయారు చేసేందుకు అనుమతించిన ప్రభుత్వంపై కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ ధ్వజమెత్తారు. దేశంలో ఎంతో మంది పేదలు ఆకలితో మరణిస్తుంటే బియ్యాన్ని ఇలా వినియోగించడమేంటని ప్రశ్నించారు.

Rahul slams govt for allowing use of rice to make sanitiser
ఆకలి చావులు పెరుగుతుంటే.. బియ్యంతో శానిటైజర్లా?

శానిటైజర్లు తయారు చేసేందుకు బియ్యం ఉపయోగించేందుకు అనుమతిచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు కాంగ్రెస్​ నాయకుడు రాహుల్​ గాంధీ.

తిండి లేక దేశంలో ఎంతో మంది మరణిస్తున్నారని, అలాంటి వారి ఆకలి కేకలు పట్టించుకోకుండా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు రాహుల్.

"దేశంలో పేద ప్రజలు ఎప్పటికి మేల్కొంటారు? ఓ వైపు మీరు ఆకలితో చనిపోతున్నారు. కానీ ప్రభుత్వం మీ ఆకలిని పట్టించుకోకుండా ధనవంతుల చేతులు శుభ్రం చేసేందుకు బియ్యాన్ని ఉపయోగించి శానిటైజర్ల తయారీకి సిద్ధమవుతోంది."

-- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

దేశంలో శానిటైజర్ల తయారీకి మిగులు బియ్యాన్ని వాడటానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఫుడ్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా(ఎఫ్​సీఐ)లో మిగిలే బియ్యంతో ఆల్కహాల్​ ఆధారిత శానిటైజర్లు తయారు చేసేందుకు సోమవారమే అనుమతులు ఇచ్చింది.

ఇదీ చదవండి:కన్నబిడ్డను విడిచి ఒకరు.. కడుపులో బిడ్డతో మరొకరు!

ABOUT THE AUTHOR

...view details