తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యూపీ పోలీసులపై ఎన్​హెచ్​ఆర్​సీకి కాంగ్రెస్​ ఫిర్యాదు

సీఏఏ నిరసనకారులపై యూపీ పోలీసుల చర్యలను తప్పుబడుతూ జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది కాంగ్రెస్. పోలీసులు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణలపై సమగ్ర విచారణకు డిమాండ్ చేసింది.

By

Published : Jan 27, 2020, 6:43 PM IST

Updated : Feb 28, 2020, 4:18 AM IST

nhrc
యూపీ పోలీసులపై ఎన్​హెచ్​ఆర్​సీకి కాంగ్రెస్​ ఫిర్యాదు

జాతీయ మానవ హక్కుల కమిషన్‌ అధికారుల్ని రాహుల్​ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్​ నేతల బృందం కలిసింది. సీఏఏకు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్​లో జరిగిన ఆందోళనలలో పోలీసులు మానన హక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లు ఫిర్యాదు చేసింది. 'పోలీసుల అరాచకాల'పై ఆధారాలను 31 పేజీల నివేదిక రూపంలో ఎన్​హెచ్​ఆర్​సీకి సమర్పించింది.

పోలీసుల అకృత్యాలపై, ఆందోళనలలో జరిగిన మరణాలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని కాంగ్రెస్​ నేతలు డిమాండ్​ చేశారు. అల్లర్లలో బాధితులను నిందితులుగా పేర్కొన్నారు గానీ మానవహక్కులను ఉల్లంఘించిన ఏ ఒక్క పోలీసు అధికారుల పేర్లను ఎఫ్​ఐ​ఆర్​లో నమోదు చేయలేదని నివేదించారు.

ఇదీ చూడండి: ఆవు కోసం పులితో పోరాడి ప్రాణాలు కోల్పోయిన యువకుడు

Last Updated : Feb 28, 2020, 4:18 AM IST

ABOUT THE AUTHOR

...view details