తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దీదీ హామీల అమలులో విఫలమయ్యారు : రాహుల్​

బెంగాల్​ ప్రజలను మమతా బెనర్జీ హామీలతో మోసగిస్తున్నారని రాహుల్​ విమర్శించారు. ఎన్నికల వాగ్దానాలను అమలు చేయకుండా మభ్యపెడుతున్నారని ఆరోపించారు.

By

Published : Mar 23, 2019, 5:43 PM IST

దీదీ హామీల అమలులో విఫలమయ్యారు

దీదీ హామీల అమలులో విఫలమయ్యారు
కొన్ని రోజుల క్రితం వరకూ మహాకూటమి అంటూ 'భాయీబెహన్'లా ఉన్న రాహుల్​-మమతాలు ఇప్పుడు పరస్పర విమర్శల పర్వానికి తెరతీశారు. పశ్చిమబంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్​ తీవ్ర విమర్శలు చేశారు. దీదీ పాలనలో ప్రజలు కష్టాల్లో జీవిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయటంలో మమత పూర్తిగా విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతులు, పేదలు, యువతను అందరినీ హామీలతో మోసం చేశారని రాహుల్​ విమర్శించారు. ఓ వైపు ప్రధాని మోదీ దేశ ప్రజలను అబద్ధాలతో మోసం చేస్తుంటే... దీదీ బెంగాల్​ ప్రజలను హామీలు అమలు చేయకుండా మాటలతో కాలం గడుపుతున్నారని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details