తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేరళలో నర్సు రాజమ్మను కలిసిన రాహుల్​ - రాహుల్​

49 ఏళ్ల క్రితం దిల్లీలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో తనను ఎత్తుకున్న మొదటి వ్యక్తి నర్సు రాజమ్మ వావతిల్​ను కలిశారు కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ. రాహుల్​ తనను కలిసినందుకు సంతోషం వ్యక్తం చేశారు వావతిల్​.

కేరళలో నర్సు రాజమ్మను కలిసిన రాహుల్​

By

Published : Jun 9, 2019, 5:40 PM IST

కేరళలో నర్సు రాజమ్మను కలిసిన రాహుల్​
రాహుల్​ గాంధీని కలవటం కేరళకు చెందిన 72 ఏళ్ల విశ్రాంత నర్సు రాజమ్మ వావతిల్​కు ఓ ప్రత్యేక క్షణం. 49 ఏళ్ల క్రితం దిల్లీ ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన రాహుల్​ను తన చేతులతో ఎత్తుకున్నారు వావతిల్​. శిశువుగా ఉన్నప్పుడు తాను ఎత్తుకున్న వ్యక్తి తమ నియోజకవర్గ పార్లమెంటు సభ్యునిగా ఎదిగి రావటంపై సంతోషం వ్యక్తం చేశారు.

కోజికోడ్​లోని అతిథి గృహానికి రాజమ్మతో పాటు ఆమె కుటుంబ సభ్యులు వచ్చారు. బిజీ బిజీగా ఉన్న సమయంలోనూ.. తనను కలిసేందుకు వచ్చిన రాజమ్మను కలిసి హత్తుకున్నారు రాహుల్​. దగ్గరకు తీసుకుని ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులను అభినందించారు.

" రాహుల్​ను కలిసినందుకు నేను ఆనందంగా, ఉత్సాహంగా ఉన్నాను. రాహుల్​ పుట్టినప్పుడు ఎత్తుకున్న మొదటి వ్యక్తిని నేనే. ఆయనను కలిసిన సందర్భంలో అప్పటి జ్ఞాపకాలు నా మనసులో మెదిలాయి."

-రాజమ్మ వావతిల్, విశ్రాంత నర్సు.

మురిసిన రాహుల్​...

రాహుల్​ గాంధీతో తన జ్ఞాపకాలను పంచుకున్నారు రాజమ్మ. అప్పుడే పుట్టిన శిశువుని చేతిలోకి తీసుకుని లాలించిన విషయాన్ని పంచుకున్నారు. ఆమె మాట్లాడుతున్నంత సేపు చిరునవ్వుతో వింటూ ఉండిపోయారు రాహుల్​.

ప్రేమతో స్వీట్లు...

రాహుల్​కు తాను పనసపండుతో స్వయంగా తయారు చేసిన చిప్స్, స్వీట్లు అందించారు రాజమ్మ. మళ్లీ తనను తప్పకుండా కలుస్తానని మాట ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు రాహుల్.

ఇదీ చూడండి:చిన్నారి మాటకు మురిసిన రాహుల్​ గాంధీ

ABOUT THE AUTHOR

...view details