తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనాపై కేంద్రానికి రాహుల్​ 'టైటానిక్​' పంచ్​

చైనాలో ప్రారంభమై ప్రపంచ దేశాలను భయాందోళనలకు గురిచేస్తున్న కరోనా ఇప్పుడు భారత్​నూ కలవరపెడుతోంది. ఈ వైరస్​ అదుపులోనే ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి చెబుతున్నారు. అయితే మంత్రి వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ.. ఇది టైటానిక్​ పడవలోని ప్రయాణికులు మునిగిపోరని చెప్పినట్లుందని ఎద్దేవా చేశారు.

By

Published : Mar 5, 2020, 5:17 PM IST

Updated : Mar 5, 2020, 9:36 PM IST

Rahul likens govt's assurance on COVID-19 to Titanic captain telling passengers not to panic
కరోనా: 'టైటానిక్​ పడవ మునిగిపోదన్నట్లుంది ప్రభుత్వ హామీ'

కరోనాపై కేంద్రానికి రాహుల్​ 'టైటానిక్​' పంచ్​

ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కరోనా వైరస్​ ప్రస్తుతం భారత్​లో చాలా వేగంగా వ్యాపిస్తోంది. ప్రాణాంతక వైరస్​తో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్న తరుణంలో కోవిడ్​-19 అదుపులోనే ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్​ స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వ ప్రకటనపై వ్యంగాస్త్రాలు సంధించారు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్​ గాంధీ.

ప్రజలు తీవ్ర భయాలకు లోనవుతుంటే.. ప్రభుత్వం కలవరపడాల్సిన అవసరం లేదని చెప్పడం.. టైటానిక్​ పడవ మునిగిపోదని ప్రయాణికులకు కెప్టెన్​ ధైర్యం చెప్పినట్టు ఉందని ఎద్దేవా చేశారు.

" భారత్​లో కరోనా వ్యాప్తి అదుపులో ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఇది టైటానిక్ పడవలోని ప్రయాణికులు మునిగిపోరని పడవ కెప్టెన్​ చెప్పడం లాంటిది. ప్రజల్ని ఈ విపత్తు నుంచి రక్షించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి.​"

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అగ్రనేత

భారత్​లో ఇప్పటి వరకు 30 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో 16 మంది ఇటాలియన్లు.

ఇదీ చదవండి:ఏడుగురు కాంగ్రెస్​ ఎంపీలపై సస్పెన్షన్​ వేటు

Last Updated : Mar 5, 2020, 9:36 PM IST

ABOUT THE AUTHOR

...view details