తెలంగాణ

telangana

By

Published : Nov 14, 2020, 5:31 AM IST

ETV Bharat / bharat

భద్రతా దళాలపై రాహుల్​ ప్రశంసలు

నియంత్రణ రేఖ వెంబడి శుక్రవారం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్​కు.. భారత జవాన్లు దీటైన సమాధానం చెప్పారు. ఈ క్రమంలో భద్రత దళాలపై ప్రశంసలు కురిపించారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను లెక్క చేయక పోరాడి, పాక్​ దుశ్చర్యలను తిప్పికొట్టారని కొనియాడారు.

Rahul gandhi
రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

దేశ రక్షణలో, పాకిస్థాన్​ దుశ్చర్యలను తిప్పికొట్టడంలో భద్రత దళాలు ప్రదర్శించిన ధైర్య సాహసాలపై ప్రశంసలు కురిపించారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. పండుగ సమయంలోనూ కుటుంబానికి దూరంగా ఉంటూ దేశాన్ని రక్షిస్తున్నారని పేర్కొన్నారు.

జమ్ముకశ్మీర్​లోని గురేజ్​ నుంచి ఉరీ సెక్టార్​ వరకు నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ శుక్రవారం​ కాల్పులకు పాల్పడగా.. దాయాదికి భద్రత దళాలు దీటుగా జవాబు ఇచ్చాయి. ఈ క్రమంలో ట్వీట్​ చేశారు రాహుల్​​.

"పాకిస్థాన్​ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడినప్పుడల్లా, దాని భయాలు, బలహీనతలు స్పష్టంగా కనిపిస్తాయి. ప్రస్తుత పండుగ సమయంలోనూ కుటుంబాలకు దూరంగా ఉండి భారత సైనికులు మన దేశాన్ని కాపాడుతున్నారు. అలాగే పాకిస్థాన్​ కపట ప్రణాళికలను తిప్పికొడుతున్నారు. ఆర్మీలోని ప్రతి సైనికుడికి నా వందనం. "

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

దేశవ్యాప్తంగా దీపావళి జరుపుకుంటున్న క్రమంలో దాయాది పాకిస్థాన్​ తన కపట బద్ధిని ప్రదర్శించింది. జమ్ముకశ్మీర్​లోని నియంత్రణ రేఖ వెంబడి పలు సెక్టార్లలో శుక్రవారం మోర్టార్లు, తుపాకులతో కాల్పులకు పాల్పడ్డారు పాక్​ సైనికులు.

ఇదీ చూడండి: పాకిస్థాన్​ కాల్పులు- ఎస్సై సహా ముగ్గురు జవాన్లు వీరమరణం

ABOUT THE AUTHOR

...view details