తెలంగాణ

telangana

By

Published : Jul 10, 2019, 6:30 AM IST

Updated : Jul 10, 2019, 7:27 AM IST

ETV Bharat / bharat

ఓటమి తర్వాత తొలిసారి అమేఠీకి రాహుల్

కాంగ్రెస్ నేత రాహుల్ ​గాంధీ... ఇవాళ ఉత్తర్​ప్రదేశ్​లోని అమేఠీలో పర్యటించనున్నారు. సార్వత్రిక ఎన్నికల తరువాత అమేఠీ నియోజకవర్గంలో రాహుల్ పర్యటించనుండటం ఇదే మొదటిసారి. కాంగ్రెస్ కంచుకోట అయిన అమేఠీలో పార్టీ ఓటమికి కారణాలు తెలుసుకోవడానికే ఆయన ఈ పర్యటన చేపట్టారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

ఓటమి తర్వాత తొలిసారి అమేఠీకి రాహుల్

కాంగ్రెస్ నేత రాహుల్​గాంధీ నేడు ఉత్తరప్రదేశ్​లోని అమేఠీలోపర్యటించనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాజపా నేత స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయిన తరువాత... ఆ నియోజకవర్గంలో రాహుల్ పర్యటించడం ఇదే తొలిసారి.

కాంగ్రెస్ కంచుకోట అయిన అమేఠీలో... తాను ఓడిపోవడానికి గల కారణాలు తెలుసుకోవడానికే రాహుల్ ఈ పర్యటన చేపట్టినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

ఈ పర్యటనలో ఆయన పార్టీ ప్రతినిధులతో భేటీ అవుతారు. అలాగే సలోన్​, అమేఠీ, గౌరీగంజ్, జగ్దీశ్​పూర్, తలోయ్​ అసెంబ్లీ విభాగాల అధ్యక్షులతోనూ సమావేశమవుతారు. పనిలో పనిగా రాహుల్​ గాంధీ కొన్ని గ్రామాలనూ సందర్శిస్తారని ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అనిల్ సింగ్​ తెలిపారు.

అలాగే పార్టీ కార్యకర్తలతో రాహుల్​గాంధీ.... గౌరీగంజ్​లోని నిర్మలాదేవి ఎడ్యుకేషనల్​ ఇన్​స్టిట్యూట్​లో సమావేశం కానున్నారు.

ఇదీ విషయం..

సార్వత్రిక ఎన్నికల్లో అమేఠీ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాహుల్​ గాంధీ భాజపా అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో 52 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ అధికార ప్రతినిధి చంద్రకాంత్ దూబే, జిల్లా అధ్యక్షుడు యోగేంద్ర మిశ్రా తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో అమేఠీలో మరలా పార్టీని బలోపేతం చేయడంపై రాహుల్ దృష్టి సారించారు.

రాహుల్​గాంధీ అమేఠీ లోక్​సభ స్థానం నుంచి 1999 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కేరళలోని వయనాడ్ నుంచి పార్లమెంట్​ సభ్యుడిగా ఉన్నారు.

ఇదీ చూడండి: 'రుణమాఫీ తర్వాతే రైతు ఆత్మహత్యలు పెరిగాయి'

Last Updated : Jul 10, 2019, 7:27 AM IST

ABOUT THE AUTHOR

...view details